మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య చిత్రాన్ని ఇంకా విడుదల చేయనేలేదు అప్పుడే ఆయన మూడు సినిమాలను ఓకే చేసుకున్న విషయం తెలిసిందే. వీటిలో గాడ్ ఫాదర్ అనే సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు కూడా. మలయాళంలో సూపర్ హిట్ అయిన లుసిఫర్ సినిమాకు ఇది రీమేక్ కాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.  త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నయనతార ఓ కీలక పాత్రలో నటిస్తుండగా సత్యదేవ్ విలన్ రోల్ చేస్తున్నాడు.

ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా చిరంజీవి లేని కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే తాను చేయబోయే తదుపరి రెండు సినిమాల ముహూర్తలు కూడా మెగాస్టార్ చిరంజీవి పిక్స్ చేశాడట. భోళా శంకర్ సినిమా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతు ఉండగా ఇది తమిళంలో సూపర్ హిట్ అయినా వేదాలం సినిమాకి రీమేక్.  దీన్ని నవంబర్ లో సెట్స్ పైకి తీసుకు పోవాలని ఆయన భావిస్తున్నాడు. ఈ చిత్రం అతి తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తిచేసి  విడుదల చేయాలనేది చిరంజీవి ఆలోచన. ఈ సినిమా లో కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలి గా నటిస్తుండడం విశేషం. 

ఇక ఈ రెండు చిత్రాలు పట్టాలెక్కి 50 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే వాల్తేరు శీను సినిమా సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని చిరంజీవి భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదిలోనే ఈ మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నాడట. తన  రీ ఎంట్రీ లో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు అనౌన్స్ చేసి మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎప్పుడు లేని విధంగా ఫుల్ జోష్ లో ఉన్నాడు. మరి ఈ చిత్రాలు ఏ రేంజిలో విజయాలను అందుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: