తమిళనాడు ప్రజలు ఆరాధ్య దేవతగా భావించే నటి , రాజకీయ నాయకురాలు జయలలిత గారి జీవితం మీద ఎన్నో సినిమాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చాయి. ఆమె జీవితం ఆధారంగా ఈ మద్యనే వచ్చిన సినిమా తలైవి. ఎప్పటినుంచో పోస్టుపోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఈమధ్యనే థియేటర్స్ లోకి ఘనంగా విడుదలయ్యింది. హిందీ లో ఫేమస్ అయిన కంగనా రౌనాథ్ మరియు అరవిందస్వామి లాంటి నటులు నటించిన ఈ సినిమాకి రివ్యూస్ మరియు టాక్ అంత బాగా వచ్చింది.


అయితే కలెక్షన్స్ మాత్రం ఈ సినిమాకి చాలా దారుణంగా వచ్చాయి. దానికి కారణం పాన్ ఇండియా మూవీ గా తీసిన ఈ సినిమా మాత్రం ప్రస్తుతం హిందీ మార్కెట్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా విడుదల చేసారు హిందీలో కరోన తర్వాత విడుదలైన ఏ సినిమాలు హిట్ కాలేదు. అలాగే తమిళనాడు , మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా అంతే. ఎంతో హైప్ ఉంటే తప్ప జనాలు థియేటర్స్ కి రావట్లేదు. అయితే ఇలాంటి సమయంలో చాలా తక్కువ ప్రమోషన్స్ తో విడుదలైన తలైవి ప్లాప్ అవ్వక తప్పలేదు. అయితే ఈ సినిమాకి మంచి పేరు రావడంతో మూవీ మేకర్స్ మాత్రం దీనికి రెండో భాగాన్ని తియ్యబోతున్నారు అని టాక్.

ఈ రెండో భాగంలో జయలలిత గారి మరణం వరకు అన్ని సంఘటలు సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికె ఈ కథ మీద ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు కూర్చున్నారు అని టాక్. అలాగే ఈ రెండోవ భాగంలో కూడా కంగనా నే హీరోయిన్ గా నటిస్తుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మొదటి భాగమే ప్లాప్ అయ్యాక ఇంకొక సినిమా అవసరమా అని సోషల్ మీడియా కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇక ఈ సినిమాకి కూడా డైరెక్టర్ గా విజయ్ నే తీసుకుంటారు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: