దూకుడు సినిమా నేటి కి 10 సంవత్స రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల ట్వీట్టర్ వేదిక న దీనిపై స్పందించాడు. దూకుడు సినిమా మర్చి పోలేని అనుభూతి అని అన్నాడు. ఈ సినిమాకు ఎస్ ఎస్ థామన్ మంచి మ్యూజిక్ అందించాడని గుర్తు చేశారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు తో మరో సినిమా చేయనున్నట్టు తెలిపారు. దీని కోసం ఇప్పటికే కథ సిద్ధం చేసు కున్నట్టు వివరించారు. ఈ సినిమా మరో దూకుడు లా ఉంటుందని అన్నారు. అంతే హిట్ కొట్టి తనకు మంచి పేరు తీసుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే దర్శకుడు శ్రీను వైట్ల చాలా రోజుల నుంచి మంచి హిట్ లేక సతమత మవుతున్నాడు. ఆయన డైరెక్షన్ చివరగా 2018 లో అమర్ అక్భర్ అంటోనీ వచ్చింది. ఈ సినిమాలో రవి తేజ, ఇలియానా జంట గా నటించారు. రవి తేజ, ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అందుకున్నవా కాబట్టి ఈ సినిమా పై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. ప్రస్తుతం శ్రీను వైట్ల మంచు విష్ణు తో డీ సినిమా సిక్వెల్ ను తీస్తున్నారు. దీనికి డీ అంటే డీ అని ఖరారు చేశారు. ఈ సినిమా నవంబర్ 1 నుంచి పట్టాల పైకి వెళ్తున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత మహేష్తో సినిమా ఉంటుందని తెలుస్తోంది.