తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.ఆయన తన సినీ జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి..అగ్ర హీరోగా ఎన్ని ఘన విజయాలను అందుకున్నాడు.అయితే చిరంజీవి కెరీర్ మొదట్లో పలు చిన్న చిన్న పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.అయితే మెగాస్టార్ హీరోగా సుమారు 39 సంవత్సరాల క్రితం బిల్లా రంగా అనే సినిమా తెరకెక్కింది.అగ్ర దర్శకులలో ఒకరైన కె. ఎస్. ఆర్. దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి చొక్కా మార్చుకుంటుడగా కె. ఆర్. దాస్.కు వీపుపై పెద్ద పుట్టుమచ్చ కనిపించింది.

ఆ మచ్చను చూసిన కె. ఆర్. దాస్ సీనియర్ ఎన్టీఆర్ లాగా నీకు కూడా పెద్ద మచ్చ ఉందని..ఆయన లాగే నువ్వు కూడా పెద్ద హీరో అయ్యి.. పాపులారిటీని సంపాదించుకుంటావంటూ చిరంజీవికి చెప్పుకొచ్చారు.ఇక ఆ తరువాత కాలంలో ఆయన జోస్యం నిజమై..చిరంజీవి నిజంగానే మెగాస్టార్ గా స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు.ఇక దాదాపు 35 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండ్రస్టీ లో ఉన్న అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.స్టార్ డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్లు అనే తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న దర్శకులను ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు చిరంజీవి.ఇక ప్రస్తుతం ఈ సీనియర్ హీరో ఒక్కో సినిమాకు 30 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పుడు నటిస్తున్న సినిమాలు కనుక విజయం సాధిస్తే చిరంజీవి ఇంకా తన రెమ్యునరేషన్ ని పెంచే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటె  ప్రస్తుతం యువ హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇక తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా అనంతరం తమిళ దర్శకుడు మోహన్ రాజా తో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ తో భోళా శంకర్, బాబీ డైరెక్షన్లో ఓ సినిమా..ఇలా వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.ఇక ఇప్పటికే ఆచార్య షూటింగ్ ని పూర్తి చేసిన చిరు.. మరికొద్ది రోజుల్లోనే గాడ్ ఫాదర్ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు...!!


మరింత సమాచారం తెలుసుకోండి: