ప్రభాస్ గురించి ప్రతీ హీరోయిన్ పాజిటివ్గానే చెప్పింది. అయితే పూజా హెగ్డేకి మాత్రం ప్రభాస్తో ఇష్యూస్ ఉన్నాయని, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయనే స్టేట్ మెంట్స్ ఎక్కువయ్యాయి. పూజా హెగ్డే గురించి ఇప్పటివరకు ఎక్కడా నెగటివ్ కామెంట్స్ వినిపించలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్నిచోట్లా మంచి ఇమేజే ఉంది. అయితే కొన్నాళ్లుగా ప్రభాస్తో ఇష్యూస్ ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో 'రాధేశ్యామ్' మేకర్స్ రంగంలోకి దిగారు. అలాంటివేం లేవని క్లారిటీ ఇస్తున్నారు. మరి ఏం లేకపోతే ఈ ప్రచారం ఎందుకు మొదలైంది.
అయితే ప్రభాస్.. పూజా క్లారిటీ ఇవ్వకపోయినా... సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఈ ఇష్యూపై 'రాధేశ్యామ్' మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ప్రభాస్, పూజా హెగ్డే గురించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చెయ్యొద్దని చెప్పారు. ఇక రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో లార్జ్స్కేల్లో రూపొందిన ఈ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 14న విడుదలవుతోంది. చూద్దాం.. ఈ లోపు ఇంకెన్ని గాసిప్స్ పుట్టుకొస్తాయో. ఈ పుకార్లకు ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో.