ప్రభాస్.. పూజా హెగ్డే మధ్య ఏదో జరిగిపోయిందట. అదీ మరేదో అనుకోకండి.. ఇద్దరికీ గొడవలు జరిగాయని గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అవే సోషల్ మీడియా చక్కర్లు కొట్టాయి. అటు ప్రభాస్ కానీ.. ఇటు పూజా హెగ్డే కానీ ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ప్రభాస్‌ గురించి చాలామంది హీరోయిన్లు గొప్పగా చెబుతుంటారు. ముఖ్యంగా ప్రభాస్‌ ఇంటి భోజనం గురించి కూడా పోస్టులు పెడుతుంటారు. డార్లింగ్‌ ఫుడ్‌తో చంపేస్తాడని శ్రద్ధా కపూర్, శృతి హాసన్ లాంటి హీరోయిన్లు కూడా చెప్పారు. ఇక భాగ్యశ్రీ అయితే డార్లింగ్‌ పూతరేకుల్లాంటి వాడని, బాక్సుల కొద్ది ఇచ్చిన పూతరేకుల స్టోరీ చెప్పింది.

ప్రభాస్‌ గురించి ప్రతీ హీరోయిన్‌ పాజిటివ్‌గానే చెప్పింది. అయితే పూజా హెగ్డేకి మాత్రం ప్రభాస్‌తో ఇష్యూస్‌ ఉన్నాయని, ఇద్దరి మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో సోషల్‌ మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయనే స్టేట్ మెంట్స్ ఎక్కువయ్యాయి. పూజా హెగ్డే గురించి ఇప్పటివరకు ఎక్కడా నెగటివ్‌ కామెంట్స్ వినిపించలేదు. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు అన్నిచోట్లా మంచి ఇమేజే ఉంది. అయితే కొన్నాళ్లుగా ప్రభాస్‌తో ఇష్యూస్‌ ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో 'రాధేశ్యామ్' మేకర్స్‌ రంగంలోకి దిగారు. అలాంటివేం లేవని క్లారిటీ ఇస్తున్నారు. మరి ఏం లేకపోతే ఈ ప్రచారం ఎందుకు మొదలైంది.

అయితే ప్రభాస్.. పూజా క్లారిటీ ఇవ్వకపోయినా... సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న ఈ ఇష్యూపై 'రాధేశ్యామ్' మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ప్రభాస్, పూజా హెగ్డే గురించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చెయ్యొద్దని చెప్పారు. ఇక రాధాక్రిష్ణ కుమార్‌ దర్శకత్వంలో లార్జ్‌స్కేల్‌లో రూపొందిన ఈ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 14న విడుదలవుతోంది. చూద్దాం.. ఈ లోపు ఇంకెన్ని గాసిప్స్ పుట్టుకొస్తాయో. ఈ పుకార్లకు ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: