శర్వానంద్ హీరోగా సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహాసముద్రం దసరా కానుకగా అక్టోబర్ 16 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈ రోజు చిత్ర బృందం విడుదల చేసింది ఆర్ ఎక్స్ 100 సినిమాతో భారీ హిట్ సంపాదించుకుని రెండవ సినిమా కోసం చాలా రోజులు కష్టపడి ఈ సినిమాను సెట్ చేసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఆయన పై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కిందనీ ఈ ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది.

అజయ్ భూపతి లో రచయిత ఒకసారి అద్భుతమైన డైలాగులు రాశాడని దర్శకుడు అద్భుతమైన టేకింగ్ తో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీగా ఉన్నాడ ని తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100 సినిమా లో ఎంత ఇంటెన్సి టీ ఎంత ఎమోషన్ ఈ సినిమాలో కూడా అంతే ఇంటెన్సిటీ ఎమోషన్ దాగుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగులు అదిరిపోతాయి అని కొన్ని కొన్ని పాత్రలు చెప్పిన మాటలను బట్టి అర్థమవుతుంది. 

రావు రమేష్ చెప్పిన డైలాగ్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలెట్ అని చెప్పవచ్చు. మీరు చేస్తే లితి నేను చేస్తే భూత అని సిద్ధాంతి చెప్పే డైలాగ్స్ కు థియేటర్లలో కూడా విజిల్స్ పడడం గ్యారెంటీ అంటున్నారు. అంతేకాదు రావు రమేష్ చెప్పి న మరొక డైలాగ్ కూడా ఈ సినిమాకే హైలెట్ గా నిలవనుంది. పగబట్టిన పాము ను చంపడమే మార్గం అని ఆయన చెప్పే డైలాగ్ నభూతోనభవిష్యత్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో రొమాన్స్ కూడా అదే రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. అదితి రావు హైదరి మరియు అను ఇమాన్యుయేల్ ఎంతో ఇన్వాల్వ్ అయి ఈ సినిమాలో నటించా రు. 

మరింత సమాచారం తెలుసుకోండి: