సౌత్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, అక్కినేని హీరో నాగ చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం 'లవ్ స్టోరీ'.క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్  ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితి పాటూ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ స్పెషల్ గెస్ట్స్ గా వచ్చారు.ఇక ఈ ఈవెంట్ లో సాయి పల్లవి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈవెంట్ జరుగుతుండగా మధ్యలో సాయిపల్లవిని చిరంజీవి ఎందుకు అలా అడిగారు..?

తన సినిమాలో నటించను అని అంటే  అలా అడిగేయాలా అని గత  కొన్ని రోజులుగా చిరంజీవి అన్న మాటల గురించి మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు.అయితే ఆ సినిమాలో నటించకపోవడానికి సాయి పల్లవి చెప్పిన కారణాలు నమ్మొచు.అయితే ఇప్పుడు నెటిజన్ల చూపంతా సాయి పల్లవి మీదే.ఎందుకు అంటే ఇప్పుడు తను మాట మార్చేసింది.నా సినిమాలో చెల్లెలి పాత్ర కోసం సాయిపల్లవిని అడిగితే చేయను అందట అంటూ చిరంజీవి 'లవ్‌స్టోరీ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చెప్పారు.అప్పుడు సాయి పల్లవి నాకు రీమేక్‌లంటే భయం... అందుకే మీ సినిమా ఛాన్స్‌ వస్తే నో అన్నాను అంటూ చెప్పింది.కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా 'రీమేక్‌లంటే భయం అని కాదు.

మాతృకలోని పాత్రకు న్యాయం చేయగలుగుతానా అనే భయంతో ఒప్పుకోలేదు' అని మాట మార్చింది.రిమేక్  చేయకూడదు అని కాదు.కానీ రిమేక్ చేయాలి అంటే ఏదో భయం.అదే ఒరిజినల్ సినిమా అయితే  ఆ పాత్ర స్థాయిలో ఇక్కడా చేయాలి. లేదా దాని కన్నా  కొత్తగా, ఇంకా బాగా చేయాలి.ఈ ప్రాసెస్ అంతా జరిగే క్రమంలో ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. అందుకే చిరంజీవి సినిమా నో అన్నాను అని అంతే తప్ప రిమేక్ సినిమా అని నో చెప్పలేదు అని చాలా పెద్ద ఎక్స్ ప్లేనేషన్ ఇచ్చింది సాయి పల్లవి.ఇదంతా చూస్తుంటే సాయి పల్లవి ఈ విషయంలో మాట మార్చేసిందని అంటున్నారు టాలీవుడ్ జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: