సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో సినిమా చేయాలంటే మంచి కంటెంట్ ఉన్న కథలు కావాలి. ఇప్పటి హీరోలు స్టోరీ సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఎందుకంటే ఇప్పుడున్న ఆడియన్స్ కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని చూడటానికి ఇష్టపడటం లేదు.మంచి కంటెంట్ ఉన్న సినిమాలకే మొగ్గుచూపుతున్నారు.ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాజెక్ట్ ఓకే అయ్యి.. కథ కుదరక కుస్తీలు పడుతున్న దర్శకులు చాలామందే ఉన్నారు మన టాలీవుడ్ లో.ఇక తాజాగా ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కి కూడా ఇదే ఇబ్బంది వచ్చింది.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి ఓ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.అయితే విజయ్ కోసం వంశీ పైడిపల్లి రెడీ చేసిన కథ ఇంకా ఓకే అవ్వలేదు.

ఈ కథ విజయ్ కి అంతగా నచ్చలేదని తెలుస్తోంది.దీంతో మళ్ళీ కథపై కూర్చున్నాడట వంశీ పైడిపల్లి.దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడి పల్లి విజయ్ ల కాంబోలో ఓ సినిమా ఉంటుందని వార్తలు ప్రచారం అయిన విషయం తెలిసిందే.వంశీ చెప్పిన పాయింట్ నచ్చడంతో విజయ్ పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పినట్లుగా గతంలో వార్తలొచ్చాయి.దీంతో వంశీ గత కొద్ది రోజులుగా ఇదే పని మీద ఉన్నాడు.అలా రెడీ చేసిన కథను విజయ్ కి వినిపించాడట.అయితే ఆ కథపై పూర్తి సంతృప్తి చెందని విజయ్.. కథలో కొన్ని మార్పులు సూచించనట్లు తెలుస్తోంది.దీంత మళ్ళీ ఆ కథలో కొన్ని మార్పులు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇక మహర్షి సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్న వంశీ పైడిపల్లి..

అదే సమయంలో మళ్ళీ. మహేష్ బాబు కోసం ఓ కథను రెడీ చేసాడు.అయితే ఆ కథ మహేష్ కి నచ్చకపోవడంతోదాని పై కొన్ని రోజుల వరకు వర్క్ చేసాడు.ఈ క్రమంలో మహేష్ బాబు వేరే పనుల్లో బిజీ అయిపోయారు.దీంతో ఆ ప్రాజెక్ట్ అలానే ఓ పక్కన ఉండిపోయింది.ఇక ఇప్పుడు విజయ్ సినిమా కోసం కథ రెడీ చేస్తే..మళ్ళీ అదే సీన్ రిపీట్ అయ్యింది. మరి విజయ్ చెప్పినట్లు కథలో మార్పులు చేసి.. మళ్ళీ విజయ్ తో ఓకే చేయించుకుంటాడా.?లేదా? అనేది చూడాలి.ఏదేమైనా 'ఆహా' లో కథలు ఫైనల్ చేసే వంశీ పైడిపల్లి తన కథతో హీరోలను మెప్పించలేకపోతున్నారెందుకో..!!

మరింత సమాచారం తెలుసుకోండి: