హాట్ బ్యూటీ శాలిని పాండే, విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాలో తన నటనతో పాటు అందచందాలను కూడా వెండితెరపై ఆరబోసిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఆశించినన్ని అవకాశాలు రాలేదు. కళ్యాణ్ రామ్ సరసన 118, మహానటి సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అయితే ఇందులో భాగంగా బాలీవుడ్ కెరీర్ ప్రారంభంలోనే రన్ వీర్ సింగ్ లాంటి హీరోతో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది.

ప్రస్తుతం శాలిని పాండే రన్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కుతున్న 'జయేశ్ భాయ్ జోర్డార్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దివ్యాంగ్ టక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలింస్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. కాకపోతే మహారాష్ట్రలో ఇంకా పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ కాలేదు. ఇంకా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఈ నేపథ్యంలో శాలిని పాండే తన మనసులో మాట బయటకు చెప్పింది. రన్వీర్ సింగ్ తో నటిస్తున్న తొలి సినిమా ఇది. సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. దేశవ్యాప్తంగా సినిమా విడుదలైతే వెండితెరపై నన్ను నేను చూసుకోవాలని చాలా కోరికతో ఉన్నాను. నా తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశతో ఉన్నారు. ఏడాదిన్నర కాలంగా సినిమా విడుదల కోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం. హిందీలో చేస్తున్న తొలి పెద్ద సినిమా ఇది కావడంతో చాలా ఉత్సాహంతో ఉన్నాను. నా ఎమోషన్స్ అదుపుతప్పుతున్నయి అంటూ శాలిని పాండే తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: