తన కెరీర్ పరంగా ప్రస్తుతం వరుసగా ఒకదానివెంట మరొకటి సినిమాలు ఎంచుకుంటూ వేగంగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇటీవల కొన్నేళ్ల విరామం తరువాత ఖైదీ నెంబర్ 150 మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవిసినిమా తో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టి తన పాపులారిటీ, చరిష్మా, బాక్సాఫీస్ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. తమిళ మూవీ కత్తి రీమేక్ గా రూపొందిన ఆ మూవీలో మెగాస్టార్ చిరంజీవి డ్యూయల్ రోల్ చేయగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించారు.

దాని అనంతరం సైరా నరసింహారెడ్డి మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్, ప్రస్తుతం కొరటాల శివ తో చేస్తున్న సినిమా ఆచార్య. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక రోల్ చేస్తున్న ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ తో పాటు మెగాస్టార్ మరొక మూడు సినిమాలు కూడా ఇప్పటికే లైన్లో పెట్టారు. వాటిలో మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ నేడు షూటింగ్ ని ప్రారంభించగా, త్వరలో మెహర్ రమేష్, అలానే బాబీ తో సినిమాలు చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం త్వరలో మెగాస్టార్ చిరంజీవి మరొకసారి డ్యూయల్ రోల్ చేయనున్నట్లు టాక్. త్వరలో మైత్రి మూవీ మేకర్ బ్యానర్ పై బాబీ తీయనున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో చిరంజీవి రెండు పాత్ర ల్లో కనిపించనుండగా ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. కథ ప్రకారం రెండు పాత్రలు ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటాయని, తప్పకుండా ఈ మూవీ విడుదల తరువాత పెద్ద సక్సెస్ అందుకోవడం ఖాయం అని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలి అంటే ఆ మూవీ యూనిట్ నుండి అధికారికంగా ప్రకటన రావాలని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: