స్వర,రాగ ప్రవాహంలో తానొక బిందువుని అని చెప్పుకునే ఎస్పీ బాలు చనిపోయి అప్పుడే ఏడాది అయిపోయిందా! అన్న దిగ్భ్ర మ నుంచి కోలుకోలేని వారెందరో..!ఆయన పాడిన పాటల పల్లవులను పునఃశ్చరణ చేస్తూ, సంబంధిత స్వర గాన సంగతులను ప లికిస్తూ, ఉన్నతిని సాధించాలన్న తపనలో ఉన్నవారెందరో! వారంతా వర్థమాన గాయకులు. బాలూ ను నిరంతరం అనుసరిం చే శిష్యులు. ఆ..శిష్య గణం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఓ గొప్ప నివాళికి శ్రీకారం దిద్దింది.ఆ..మంచి గాయకుడు నేర్పిన కొన్ని మం చి మాటలను మరొక్కసారి స్మరించనుంది. ఆ కార్యక్రమ వివరాలివి.
గాన గంధర్వుడి ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని శ్రీకాకుళంలో ఓ ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. వర్థమాన గా యనీ గాయకులంతా కలిసి ఆయనకు స్వర నీరాజనం ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన పాటల పూదోటలో విహరిం చేం దుకు, ఆయన పాడిన పాటలలో కొన్నింటిని పునఃస్మరణ చేసుకునేందుకు ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తూ.. సంబంధిత ఏ ర్పా ట్లలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సిక్కోలు ఫ్యూచర్ సింగర్స్, మిత్రా ఫౌండేషన్ (శ్రీకాకుళం) సంయుక్తంగా స్థానిక బాపూజీ క ళామందిరంలో నిర్వ హించనుంది. సెప్టెంబర్ 25న ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, అలానే సాయంత్రం నాలు గు గంటల నుంచి ఎని మిది గంటల వరకూ జరిపేందుకు నిర్వాహకులు సన్నద్ధం అవుతున్నారు. ఔత్సాహిక కళాకారులు, గాయ నీ, గాయకులను ప్రోత్స హించాలన్న సదుద్దేశంతో ఆ మహనీయుడు చేసిన ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని అవలోకిస్తూ.. సాగే ఈ కార్యక్రమాన్ని అంతా కలిసి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.