ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో కూడా పలువురు యువ దర్శకులు మంచి టాలెంట్ తో సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ మనసు గెలుచుకుంటూ ఉన్నారు. ఆ విధంగా రెండేళ్ల క్రితం కార్తీ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ ఖైదీ తో సూపర్ హిట్ కొట్టిన యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఆ తరువాత ఏకంగా ఇలయతలపతి విజయ్ తో చేసిన సినిమా మాస్టర్.

ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టి ఆయనకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా ప్రస్తుతం లోకనాయకుడు కమల్ హాసన్ తో విక్రమ్ అనే మూవీ చేస్తున్నారు లోకేష్. ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అవుతున్న ఈ సినిమా షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా లోకేష్ మాట్లాడుతూ, తాను కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లని ప్రత్యేకంగా కలిసినట్లు చెప్పారు. వారిద్దరి కోసం ప్రస్తుతం తాను కథలు సిద్ధం చేస్తున్నానని, అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తానని ఆయన అన్నారు.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం లోకేష్ కనికరాజ్ వారిద్దరో కోసం మాత్రమే కాదు మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం కూడా లోకేష్ ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేసేపనిలో ఉన్నారని చెప్తున్నారు. చాలావరకు పూర్తి అయిన ఈ స్టోరీ ని వీలైనంత త్వరలో ఎన్టీఆర్ కి వినిపించి ఆమోదం కూడా అందుకోనున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే టాలీవుడ్ కి చెందిన ఒక అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించనుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే తొలిసారిగా ఎన్టీఆర్ తో లోకేష్ కనకరాజ్ మూవీ చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: