ప్రస్తుతం బాలయ్య హీరోగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా అఖండ. బాలయ్య రెండు రకాల పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా శ్రీకాంత్ విలన్ గా యాక్ట్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను ఎంతో భారీ స్థాయిలో మాస్, యాక్షన్ మూవీ గా రూపొందిస్తున్న ఈ సినిమా పై బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన రెండు టీజర్స్ తో పాటు ఒక సాంగ్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానున్నట్లు చెప్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కొరటాల శివ తో ఆచార్య మూవీ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక రోల్ చేస్తుండగా పూజా హెగ్డే, కాజల్ హీరోయిన్స్ గా ఇందులో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఆచార్య అనే మాజీ నక్సలైట్ గా మెగాస్టార్ నటిస్తున్న ఈ సినిమా నుండి కొన్నాళ్ల క్రితం విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఒక సాంగ్ కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కాగా ఈ మూవీ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్. అయితే విషయం ఏమిటంటే, వచ్చే నెలలో కేవలం ఒక వారం రోజుల గ్యాప్ లోనే అటు అఖండ, ఇటు ఆచార్య రెండు సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకు రానున్నాయని, త్వరలో ఈ రెండు సినిమాల యూనిట్స్ వారు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ని అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే చాలా గ్యాప్ తరువాత మరొక్కసారి బాలయ్య, చిరు మధ్య బాక్సాఫీస్ పోరు ఖాయం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: