గత రెండు సంవత్సరాల నుండి సినిమా భవిష్యత్తు కష్టాల్లో పడిందని చెప్పాలి. ప్రజలు కూడా కరోనా మహమ్మారి కారణంగా థియేటర్ కు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. తద్వారా దర్శక నిర్మాతలు సినిమాలను థియేటర్ లో విడుదల చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. మరి కొందరు దర్శక నిర్మాతలు తమ సినిమాలను ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేసుకుంటూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అయితే ఇలా చేయడం వలన సినిమాపై ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. పైగా కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలకు ఓ టీ టీ లో తగిన లాభాలు రావడం లేదన్నది కాదనలేని వాస్తవం. అందుకే కొంచెం ఆలస్యమైనా కానీ థియేటర్ లోనే విడుదల చేయడానికి చూస్తున్నారు.

ఇప్పుడు అదే బాటలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టొరీ మూవీ ఈ రోజు ఎంతో గ్రాండ్ గా థియేటర్ లో విడుదల కానుంది. ఈ మధ్యనే కండక్ట్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ ఈవెంట్ కు హాజరయిన చిరంజీవి, అమీర్ ఖాన్ ల మాటలతో  సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమ కథా చిత్రాలకు భిన్నంగా ఇది ఉండబోతోందని ఇప్పటికే డైరెక్టర్ తెలిపారు. అంతే కాకుండా ఈ సినిమా నుండి విడుదలయిన పాటలు మరియు  ట్రైలర్ అంచనాలను మరింత పెంచాయి. కొంత కాలంగా సరైన సమయం కోసం చూస్తున్న లవ్ స్టొరీ టీమ్ ఈ రోజు థియేటర్లో విడుదల చేయనుంది.

ఈ సినిమాను నిర్మించిన శ్రీ నారాయణ దాస్ నారంగ్ మరియు శ్రీ పి రామ్మోహన్ రావు లు కూడా సినిమా విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాకు పవన్ అనే కొత్త సంగీత దర్శకుడు మంచి సంగీతాన్ని అందించారు. ఈ పాటలు ప్రతి ఒక్కరినీ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విజయం ఇప్పుడు  చాలా అవసరం. ఇప్పటికే అంచనాలు రెట్టింపు అయిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఈ మేరకు ఆదరిస్తారో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: