తన స్వర మాధుర్యంతో మనల్ని మరో లోకానికి తీసుకెళ్ళి సంతోషాల స్మరణలో ఉర్రూతలూగించిన మన బాలు గొంతు మూగబోయింది అంటే ఇప్పటికి నమ్మడం, ఆ విషయాన్ని జీర్ణించుకోవడం అసాధ్యంగానే ఉంది. 1966లో డిసెంబర్ 15 తేదీన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అప్పటి నుండి దశాబ్దాల తరబడి స్వర సేవ చేసి మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గత ఏడాది కరోనా కారణంగా ఇదే రోజున తన తనువు చాలించారు. బాలు తిరిగి వస్తారు, తిరిగి రావాలి, ఆయన స్వరం మళ్ళీ వినాలి అని ఎంతగానో ఎదురు చూసిన మనల్ని శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఎంత మాట్లాడినా తనివి తీరదు. ఆయన సినీ పరిశ్రమకు గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడుగా సేవలు అందించి తన ప్రతిభను చాటుకున్నారు.
తన స్వర మాధుర్యంతో మనల్ని మరో లోకానికి తీసుకెళ్ళి సంతోషాల స్మరణలో ఉర్రూతలూగించిన మన బాలు గొంతు మూగబోయింది అంటే ఇప్పటికి నమ్మడం, ఆ విషయాన్ని జీర్ణించుకోవడం అసాధ్యంగానే ఉంది. 1966లో డిసెంబర్ 15 తేదీన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న అనే చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అప్పటి నుండి దశాబ్దాల తరబడి స్వర సేవ చేసి మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గత ఏడాది కరోనా కారణంగా ఇదే రోజున తన తనువు చాలించారు. బాలు తిరిగి వస్తారు, తిరిగి రావాలి, ఆయన స్వరం మళ్ళీ వినాలి అని ఎంతగానో ఎదురు చూసిన మనల్ని శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిపోయారు. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఎంత మాట్లాడినా తనివి తీరదు. ఆయన సినీ పరిశ్రమకు గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడుగా సేవలు అందించి తన ప్రతిభను చాటుకున్నారు.