శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ న‌టిస్తున్న `మ‌హా స‌ముద్రం` సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ను సినిమా యూనిట్ ఇటీవ‌లనే విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.  ట్రైల‌ర్ తో ఈ సినిమా మ‌రోసారి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ సంద‌ర్భంగా రెబెల్ స్టార్ ప్ర‌భాస్ మ‌హా స‌ముద్రం ట్రైల‌ర్ పై స్పందించిచారు. సినిమా టీమ్‌కు,  శ‌ర్వానంద్‌కు ఫేస్‌బుక్ వేధిక‌గా విషెస్ తెలిపాడు. దీనికి థ్యాంక్యూ అన్న అంటూ ల‌వ్ సింబ‌ల్ పెట్టి శ‌ర్వానంద్ రిప్లైయ్ ఇచ్చారు. 


`ఆర్ ఎక్స్ 100` సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అజ‌య్ భూప‌తి. తొలి సినిమాతో సెన్సెష‌న్ సృష్టించారు. ఇప్పుడు అజ‌య్ భూప‌తి రెండో సినిమాగా ` మ‌హా సముద్రం` కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సారి ఇద్ద‌రు హీరోల‌ను సినిమాలో ఉంచుతున్నాడు. ట్రైల‌ర్ విడుద‌ల త‌రువాత ఈ సినిమాపై అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. అలాగే అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా సినిమాలో న‌టీ న‌టుల‌ను దించుతున్నాడు.


  మ‌హా స‌ముద్రంలో అదితి రావు హైద‌రి,  అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్ వంటి సీనియ‌ర్ న‌టులు కూడా ఉన్నారు. దీంతో రెండో సారి కూడా అజ‌య్ భూప‌తి స‌క్సెస్ పొందేలా ఉన్నాడ‌ని సిని వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  అక్టోబ‌ర్ 14న విడుద‌ల కాబోతున్న `మ‌హా స‌ముద్రం` సినిమాలో ల‌వ్‌, యాక్ష‌న్‌, ఎమోష‌న‌ల్ క‌ల‌యిక‌గా ఉండ‌నుంది. చిత్రానికి చైత‌న్ భ‌రద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


నిన్న విడుద‌ల‌యిన సినిమా ట్రైల‌ర్‌కు వేగంగా 5 మిలియ‌న్ ల వ్యూస్ ల‌భించాయి. ఈ ట్రైల‌ర్‌లో పాత్ర‌ల స్వ‌భావాల‌ను.. ఆ పాత్ర‌ల‌కు సంబంధించిన ఎమోష‌న్స్‌ను చూపించారు చిత్ర యూనిట్‌. దీంతో చాలామందిని  ` మ‌హా స‌ముద్రం ` ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఖ‌చ్చితంగా ఈ సినిమా భారీ విజ‌యం సాధిస్తుంద‌ని సిని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. రెండో సినిమాతో వ‌స్తున్న అజ‌య్ భూప‌తికి, హీరో శ‌ర్వానంద్‌కు ఈ సినిమా హిట్ అవ‌సరం అనే చెప్పాలి. అంచ‌నాల మ‌ధ్య మ‌న ముందుకు అక్టోబ‌ర్ 14న ` మ‌హా స‌ముద్రం` రాబోతుంది.





మరింత సమాచారం తెలుసుకోండి: