సుమారు రెండు నెలల నుండి సమంత, నాగ చైతన్యల సంసార జీవితం పై రకరకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి.ఆ వార్తలతో ఈ ఇద్దరూ విడిపోవడం ఖాయమని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో నాగ చైతన్య నటించిన 'లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్ జరుగుతున్న రోజు సమంత ఇక్కడ ఉండకుండా.. చెన్నై లో త్రిష, కీర్తీ సురేష్, కల్యాణి ప్రియదర్శిని లాంటి తోటి హీరోయిన్లతో పార్టీల్లో గడిపింది. అయితే అదేమీ పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు.కాగా లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన రోజు రాత్రి నాగార్జున మూవీ యూనిట్ కి డిన్నర్ పార్టీ ఇచ్చారు.

ఆ పార్టీకి బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు.ఇక ఈ పార్టీలో నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల, నాగార్జున, అఖిల్ పాల్గొన్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఆ ఫోటోల్లో వారంతా చాలా హ్యాపీ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించారు.అయితే ఆ పార్టీలో సమంత లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.దీంతో సమంత అక్కినేని ఫ్యామిలీ లో మెంబర్ కాదనే విషయాన్ని ఈ ఫోటోలు తెలుపుతున్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు.ఇక మరోవైపు లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ..చైతూ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులని...

వారి కడుపున పుట్టి ఒక చక్కని నటుడిగా, ఒక మంచి మనిషిగా మన ముందు ఉన్నాడని ప్రశంసించడం, చైతూకి అసలైన ఫ్యామిలీ ఫ్యాన్స్ అని చెప్పడం,సమంత పేరుని కనీసం ప్రస్తావించకపోవడం లాంటివి చాలామంది గమనించారు.ఈ నేపథ్యంలో చైతూ, సామ్ ల మధ్య దూరం పెరిగిందనే విషయం..అంతేకాకుండా వారిద్దరూ విడిపోతున్నట్లుగా అమీర్ ఖాన్ కి తెలుసు కాబట్టి..ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సమంత పేరును అమీర్ ఖాన్ ప్రస్తావించలేదని అందరూ అనుకుంటున్నారు.ఇక పై అక్కినేని కుటుంబంలో జరిగే ఎలాంటి కార్యక్రమంలోనూ సమంత కనిపించే అవకాశం లేదని ఆ కుటుంబ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.అయితే ఇంత జరుగుతున్నా సమంత కానీ చైతన్య కానీ ఈ విషయం సరిగ్గా స్పందించకపోవడం గమనార్హం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: