టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ కపుల్స్ లో చైతూ, సమంత లు ఒకరు. అయితే గత కొద్దిరోజులుగా వీరిద్దరి వివాహ బంధం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయినా కూడా ఈ ఇద్దరూ ఆ వార్తలపై స్పందించకపోవడంతో ఆ వార్తలన్నీ కూడా నిజమేనేమో అని అనుకుంటున్నారు అభిమానులు.ఏ మాయ చేసావే సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరూ.. ఆ తర్వాత ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత వీరిద్దరి లైఫ్ ఎంతో కలర్ ఫుల్ గా గడిచింది. అయితే ఈ మధ్యనే వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయని అందుకే వీరు విడిపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇక వీరి పర్సనల్ లైఫ్ కి సంబంధించి వార్తలు వస్తున్న తరుణం లోనే..

 నాగ చైతన్య హీరోగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమా విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతూ కి జోడిగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇక తాజాగా విడుదలైన ఈ సినిమాను సమంత చూసిందా? అనే ప్రశ్న చాలా మంది అక్కినేని అభిమానుల్లో తలెత్తుతోంది.గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పుడు సమంత తన సోషల్ మీడియా వేదికగా చైతూ కి మరియు చిత్ర యూనిట్ కి తన బెస్ట్ విషెస్ ని అందజేసింది.

అయితే తాజాగా సినిమా విడుదలైన తర్వాత మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడా కూడా లవ్ స్టోరీ సినిమా గురించి ప్రస్తావించలేదు సమంత.దీంతో సమంత ఈ సినిమాని ఇప్పటివరకు చూడలేదని అంటున్నారు.అయితే ఈ విషయంపై సమంత సన్నిహితులు స్పందిస్తూ..ఆమె లవ్ స్టోరీ సినిమాని చూసే అవకాశం లేదని..ఒకవేళ చూసినా కూడా తన సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టదని అభిప్రాయపడుతున్నారు.ఇక లవ్ స్టోరీ సినిమా ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమా 10 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకోవడంతో చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఓ పోస్టర్ ని కూడా విడుదల చేసింది.ఇక మరోవైపు చైతూ కెరీర్లో ఈ రేంజ్ ఓపెనింగ్స్ దక్కడం కూడా ఇదే మొదటి సారి కావడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: