సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే
మాస్ మసాలా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
సంక్రాంతి కానుకగా
జనవరి 13వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది.
సూపర్ స్టార్ అభిమానులలో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మహేష్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తుండగా ఈ చిత్రంతో మరో
బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాననే నమ్మకంతో మహేష్ ఉన్నాడు.
ఇటీవలే ఓ
ఈవెంట్ కి సంబంధించిన
ప్రెస్ మీట్ లో సర్కార్ వారి పాట
సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు మహేష్. కేవలం ఒకే ఒక సిట్టింగ్లో ఈ
సినిమా ను ఓకే చేశాను అని ఆయన చెప్పాడు. తన సినిమాలకు సంబంధించిన కథల విషయంలో ఎక్కువ సిట్టింగ్స్ చేయడం తనకు ఇష్టం ఉండదని.. ఈ సినిమాలో మంచి కథ ఉందని అందుకే
సినిమా ఓకే చేశాను అని చెప్పుకొచ్చారు. కథ చాలా బాగుందని కూడా స్క్రీన్ ప్లే లో ఎంతో మ్యాజిక్ గా ఉంటుందని ఆయన వెల్లడించారు.
తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఆయనను
సూపర్ స్టార్ గా మలచిన
పోకిరి సినిమాకు ఏ మాత్రం ఇది తగ్గదని ఆయన చెప్పారు.
పోకిరి సినిమాలా మంచి రికార్డులు కొట్టడం పక్క అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ
సినిమా చేసిన తర్వాత ఆయన తన తదుపరి చిత్రాల విషయంపై కూడా ఓ క్లారిటీ ఇచ్చారు. సర్కార్ వారి పాట తరువాత
త్రివిక్రమ్ దర్శకత్వంలో
సినిమా చేస్తున్నా అన్నారు. దీని తర్వాత అతి తక్కువ కాలంలోనే
రాజమౌళి ఈ సినిమాను మొదలు పెడతారని ఆయన తెలిపాడు. 2022లో ద్వితీయార్థంలో
రాజమౌళి తో చేస్తానని చెప్పి మహేష్ తన ఫ్యాన్స్ ని ఒక్కసారిగా షాక్ కి గురి చేశాడు. మరి మహేష్ చెప్పే దాంట్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే దాకా ఎదురు చూడాల్సిందే.