టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న మీలో ఎవరు కోటీశ్వరులు షో కు  హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు బుల్లితెరపై జనాలను అలరించడం ఇది కొత్తేమీ కాదు. ఇప్పటికే ఒకసారి స్టార్ మా లో ప్రసారం అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ గా కు హోస్ట్ గా వ్యవహరించి షో పెద్ద హిట్ అయ్యేలా చేశాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారమవుతున్న మీలో ఎవరు కోటీశ్వరులు షో కు ఫుల్ హైప్ ను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే మొదటి రెండు ఎపిసోడ్ లకు రామ్ చరణ్ ను స్పెషల్ గిఫ్ట్ గా తీసుకు వచ్చాడు.

అయితే ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో టాప్ దర్శకులు అయిన రాజమౌళి, కొరటాల శివ లను ఈ షోకు ముఖ్య అతిథులుగా తీసుకువచ్చి మరోసారి షో కు భారీ హైట్ ను తీసుకువచ్చాడు. అయితే ఇప్పటికే మహేష్ బాబు తో మీలో ఎవరు కోటీశ్వరుడలు షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని ఛానల్ అధికారికంగా ప్రకటించకపోయినా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. మహేష్ బాబుతో షూటింగ్ జరిపిన ఆ ఎపిసోడ్ దసరాకు టెలికాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ , పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ ను కూడా మీలో ఎవరు కోటీశ్వరులు షో కు గెస్ట్ గా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ప్రభాస్ తో మీలో ఎవరు కోటీశ్వరులు షో దీపావళికి లేదా సంక్రాంతి వరకు అవుతుంది అని కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: