టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఎప్పటికప్పుడు తను చేసే సినిమాలకు కొత్త రకం కథలు ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్న హీరోలలో ఒకడు. ఈ హీరో ఛలో సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నాడు.  దాని తర్వాత అశ్వత్థామ అనే త్రిల్లర్ మూవీలో నటించి జనాలను మెప్పించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ హీరో వరుడు కావలెను, మరియు లక్ష అనే సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో వరుడు కావాలి సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిపోయింది.ఈ సినిమాను కూడా దసరా కానుకగా అక్టోబర్ 15 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఈ సినిమాలో నాగసౌర్య కు జంటగా రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

 ఇలా వరుడు కావలెను సినిమాను జనాల ముందుకు తీసుకురావడంలో ఫుల్ జోష్ లో ఉన్న నాగ శౌర్య అదే విధంగా తను హీరోగా నటిస్తున్న మరో సినిమా లక్ష్య ను కూడా జనాలు ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ఒక క్వశ్చన్ వేసాడు. అందుకు సంబంధించి ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చేసిన ఫోటోలో నాలుగు తేదీలను చూపిస్తూ ఈ  నాలుగు తేదీలలో లక్ష్య సినిమా ఏ తేదీన విడుదల అవుతుందో తెలియజేయండి అంటూ ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశాడు. నాగ శౌర్య పోస్ట్ చేసిన ఫోటో ను చూసిన నెటిజన్లు కొంతమంది తమకు తోచిన తేదీలను కామెంట్లు గా పెడుతున్నారు. ఇలా నాగశౌర్య తాను నటిస్తున్న సినిమాలకు సంబంధించి ప్రమోషన్ లో భాగంగా కొత్తరకంగా సినిమాలను జనాలను ముందుకు తీసుకు పోతున్నాడు. ఈ సినిమా విడుదల తేదీని రేపు ప్రకటిస్తాను అంటూ కూడా నాగశౌర్య తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: