రానా మరో కథానాయకుడుగా నటిస్తు ఉండగా ఈ ఇద్దరికి సంబంధించిన టీజర్లు ఇప్పటికే విడుదలై
సినిమా పై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. ఇటీవలే ఈ
సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాగా త్వరలోనే ఈ
సినిమా పనులను పూర్తి చేయనున్నాడు పవన్. ఇక మరొకవైపు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చాడు పవన్. ఈ చిత్రం దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి అయినట్లుగా చెబుతున్నారు.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ
సినిమా కి
కీరవాణి సంగీతం అందిస్తుండగా చారిత్రాత్మక నేపథ్యంలో ఈ
సినిమా తెరకెక్కుతుంది.
ఇక
హరీష్ శంకర్ దర్శకత్వం లోని భవదీయుడు భగవద్గీత
సినిమా ను పవన్ త్వరలోనే మొదలుపెట్టనున్నాడు. త్వరలోనే ఈ
సినిమా నీ కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. పవన్ ఇటీవలే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ ను అధికారకంగా ప్రకటించగా ఇది అందరికీ బాగా నచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అయిన
గబ్బర్ సింగ్ మరొకసారి బాక్సాఫీస్ వద్ద ఈ
సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది అన్నట్లుగా చెబుతున్నారు.
అక్టోబర్ 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో
పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది అంటున్నారు.