ఉప్పెన
సినిమా తో సూపర్ హిట్ అందుకున్న
వైష్ణవ్ తేజ్ రెండో
సినిమా గా కొండపోలం
సినిమా చేయగా అది ఈ
అక్టోబర్ 8 విడుదల కు సిద్ధమయ్యింది. ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో
యువ హీరోలకు రోజు రోజుకూ క్రేజ్ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే మెగా మేనల్లుడు ఉప్పెన
సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తొలి సినిమాతో హిట్టు అందుకోవడమే కాకుండా నటుడిగా కూడా తనని తాను నిరూపించుకున్నాడు. ఒక మధ్యతరగతి యువకుడిగా
వైష్ణవ్ తేజ్ ఈ సినిమాలో నటించి ప్రేక్షకులను
ఫిదా అయిపోయేలా చేశాడు.
ఈ అనూహ్యమైన విజయంతో ఇండస్ట్రీలో అవకాశాలు వస్తూ ఉండగా రెండవ చిత్రంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కొండపొలం అనే
సినిమా చేశాడు. ప్రముఖ
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తూండగా ప్రముఖ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు క్రిష్. గ్రామీణ యువతిగా
రకుల్ ప్రీత్ సింగ్ నటించగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల అయ్యింది. వైష్ణవ్ పాత్ర చాలా వెరైటీగా తీర్చిదిద్దినట్లు ద్వారా తెలుస్తుంది.
ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం తిరుగుతున్న సమయంలో గొర్రెలు కాసుకునే కుటుంబ నేపథ్యం చదువురాని తల్లిదండ్రులు అంటూ సమాజం అవమానిస్తూ ఉంటుంది. టైలర్ ను బట్టి ఈ సినిమాలోని కొండపొలంలో పోరాట సన్నివేశాలు అదిరిపోతాయి అని తెలుస్తుంది. గొర్రెలు కాసే యువతిగా ఓబులమ్మ గా
రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది.
పులి వేట, మానవ మృగాల నుంచి
వైష్ణవ్ తేజ్ ఏవిధంగా గెలిచాడు. తన జీవితంలో ఎలా
సక్సెస్ అయ్యాడు అనేదే ఈ
సినిమా కథ అని తెలుస్తోంది. మరొకసారి వైష్ణవ్ మంచి పాత్ర లో కనిపించబోతున్నట్లు ఈ పాత్ర ద్వారా తెలుస్తుంది. కీరవాణి నేపథ్య సంగీతం అదిరిపోయినట్లు ఈ ట్రైలర్ కు కొట్టిన సంగీతాన్ని బట్టి తెలుస్తోంది.