యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటికే ప్రభాస్ చేతిలో 4 భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి 'రాధే శ్యామ్'.ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించబోతోంది.ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమాకి కూడా తాజాగా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు మేకర్స్.వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11 న ఈ సినిమాను తెలుగుతో పాటూ హిందీ, తమిళం,కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఇక వచ్చే నెల నుండి మహారాష్ట్రలో థియేటర్స్ తెరుచుకునేందుకు అక్కడి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.దాంతో నిర్మాతలంతా పోటీ పడి మరీ తమ కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ ను లాక్ చేస్తున్నారు.ఆదివారం ఓకె రోజు ఏకంగా 13 సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఆదుపురుష్ సినిమాకి కూడా విడుదల తేదీని ఖరారు చేశారు.అయితే వచ్చే ఏడాది అదే ఆగస్టు 11 న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సిస్టర్ సెంటుమెంట్ తో తెరకెక్కుతున్న 'రక్షా బంధన్' సినిమా కూడా విడుదల కానుంది.దీని వల్ల టాలీవుడ్ తో పాటు మిగతా చోట్ల కూడా పెద్దగా సమస్య లేకపోయినా..బాలీవుడ్ లో మాత్రం చాలా పెద్ద కాంపిటీషన్ ఏర్పడే అవకాశం ఉంది.

 ఎందుకంటే ప్రభాస్ 'ఆదిపురుష్' పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. అంతేకాదు ఈ సినిమాని డైరెక్ట్ చేసేది బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ కావడం గమనార్హం.అందుకే బాలీవుడ్ లో వచ్చే ఏడాది అక్షయ్ కుమార్, ప్రభాస్ ల మధ్య గట్టి పోటీ నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి.అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ దే హవా నడుస్తోంది.ప్రభాస్ ఎంగా పెద్ద స్టార్ అయినా.. బాలీవుడ్ కి కొత్తేవాడే.కాకపోతే ఇది బాలీవుడ్ లో కూడా తీస్తున్న సినిమా కాబట్టి లెక్కలు మారే అవకాశం ఉందని అంటున్నారు.ఏదేమైనా ఆదుపురుష్ తో అక్షయ్ కుమార్ కి ప్రభాస్ మాత్రం గట్టి పోటీనే ఇచ్చేలా కనిపిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: