టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్.ఎంతోమంది సాధారణ హీరోలని తన సినిమాలతో స్టార్ హీరోలుగా మార్చాడు పూరి.అలాంటి ఆయన్ని గత కొంతకాలంగా స్టార్ హీరోలు పట్టించుకోవడమే మానేశారు.అలాంటి సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి.. భారీ కం బ్యాక్ ని అందుకున్నాడు పూరి జగన్నాథ్.ఇస్మార్ట్ హిట్ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ లో మునుపటి జోరు కనిపిస్తుంది. ఇక అదే జోరులో ఏకంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో 'లైగర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో పూరీ జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తెలుగుతో పాటూ ఈ సినిమా హిందీ, తమిళం,కన్నడ, మళయాళ భాషల్లో ఒకే రోజు విడుదల కానుంది.ఇక ఇదిలా ఉంటె సెప్టెంబర్ 28 న పూరి జగన్నాథ్ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఒకరోజు ముందుగానే పూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టారు.ఈ నేపథ్యంలో ఆయన జీవితంలో జరిగిన కొన్ని అరుదైన సంఘటనలు వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా పూరి జగన్నాథ్ పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.నిన్నే పెళ్లాడతా షూటింగ్ సమయంలో తాను ప్రేమలో పడ్డానని..

ఆ తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పూరి.అప్పటికీ తన చేతుల్లో చిల్లి గవ్వ కూడా లేదని..కానీ తన ఫ్రెండ్స్ ఆ సమయంలో అండగా నిలిచారని చెప్పాడు.ఇక తన పెళ్లి ఎర్రగడ్డ లోని ఓ గుడిలో జరిగిందని గుర్తు చేసుకున్నాడు.ఇక యాంకర్ ఝాన్సీ తన పెళ్లికి తాళిబొట్టు కొనిచ్చిందని..ఇక నటి హేమ తనకు పెళ్లి బట్టలు తీసుకువచ్చారని చెప్పాడు.ఇక అక్కడే ఉన్న మరికొందరు స్నేహితులు కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చారని తెలిపాడు.పెళ్లి బట్టలు కట్టుకొని,తాళిబొట్టు కట్టేసి ,కూల్ డ్రింక్ తాగేసి ఎంచక్కా మళ్ళీ సాయంత్రం షూటింగ్ కి వెళ్లిపోయానని చెప్పుకొచ్చాడు పూరీ జగన్నాథ్.మొత్తానికి పూరీ జగన్నాథ్ పెళ్లి కూడా చాలా సినిమాటిక్ స్టైల్లో గా జరిగిందన్నమాట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: