ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాని భారీ యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సుకుమార్ ఎంతో అద్భుతంగా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమా ని దసరా కి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 17న విడుదల చేసేలా డేట్ ఫిక్స్ చేసిందట యూనిట్.
ఇప్పటికే రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసిన యూనిట్, దసరా రోజున దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేయనుందట. ఇక త్వరలో రెండవ పార్ట్ షూటింగ్ కూడా ప్రారంభం కానుండగా దానిని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నారట. మొత్తంగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.