యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన ఆది మూవీ ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యారు వి వి వినాయక్. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ తరువాత నితిన్ తో దిల్ మూవీ తీసి మరొక సూపర్ హిట్ కొట్టారు వినాయక్. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి తో ఠాగూర్, బాలయ్య తో చెన్నకేశవ రెడ్డి, మరొక్కసారి ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమాలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. ఆపైన రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసిన నాయక్ తో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు వినాయక్.

అయితే ఆ తరువాత ప్రభాస్ తో ఆయన తీసిన యోగి, అలానే అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా తెరంగేట్రం చేసిన అఖిల్ మూవీస్ రెండూ కూడా ఫ్లాప్ అవ్వగా, అనంతరం మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 తో పెద్ద సక్సెస్ కొట్టి బ్రేక్ అందుకున్న వినాయక్, ప్రస్తుతం శీనయ్య అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. కాగా లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక భారీ సినిమా చేసేందుకు ఆయన సన్నద్ధం అవుతున్నట్లు చెప్తున్నారు.

ప్రస్తుతం చరణ్ కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేస్తున్న వినాయక్, అది పూర్తయిన తరువాత చరణ్ కి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకోనున్నారట. తన స్టైల్ తో పాటు చరణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వినాయక్ దీనిని తెరకెక్కించనుండగా ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ మూవీ ని నిర్మించనున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు చేస్తూ త్వరలో శంకర్ మూవీ కూడా  ప్రారంభించనున్న చరణ్ వినాయక్ కి ఎంత వరకు ఛాన్స్  ఇస్తారో చూడాలని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: