పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తోంది.మొన్న రిపబ్లిక్ రిలీజ్ ఫంక్షన్ లో చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారుతున్నాయి. తాజాగా పోసాని మురళి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూ మీడియా ముందర ఇలా మాట్లాడాడు.. జగన్ పనితీరును దేశమంతటా గుర్తిస్తోంది.. జగన్ మోహన్ రెడ్డి తో పోల్చుకొని పోలిక ఉందా పవన్ కళ్యాణ్ కు అని ప్రశ్నించారు.


పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల్లో నిలబడ్డా కూడా ఒక్క దానిలో కూడా గెలవలేదు. మీరు చేసిన మంచి పనులు ప్రజలు గుర్తించలేకపోయారు అనుకుందాం. ఇక మీరు తిట్టిన ఎమ్మెల్యేలు, మంత్రులు తప్పు చేస్తే.. వారిని పోలీసులకు అప్పజెప్పి , సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టామని చెప్పుకొచ్చారు.. ముందుగా మీరు చేయవలసిన ఒక పని ఉంది. మీరు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు కాబట్టి.. మీరు అక్కడికి వెళ్ళి సమస్యలను పరిష్కరించ లేరు.


అయితే సినీ ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నవి. మీరు పెద్ద హీరో కాబట్టి పరిష్కరించగలరు. మీకు ప్రశ్నించే గుణం ఉంది కాబట్టి. ఇంకా మీరు ప్రపంచంలో ఎన్నో బుక్కులను చదివారు. సినిమాలో అయితే ఆడవాళ్లను చూస్తే కళ్ళు పీకేస్తా తాట తీస్తా అని అంటారు కదా. ఆడవాళ్ళ మీద ఎంత గౌరవం ఉందో అని అర్థం అయిపోయింది.

అందుచేతనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా.."16 సంవత్సరాల పంజాబీ అమ్మాయి ఎన్నోకలలతో సినీ ఇండస్ట్రీలోకి రాగా... టాలీవుడ్ పరిశ్రమ చాలా మంచిది.. అందరూ ఆమెను ఆదరిస్తారని ఇక్కడికి రా గా.. అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు.. సినీ ఇండస్ట్రీలోని ఒక ప్రేమికుడు ఆమెకు అవకాశం ఇస్తానని చెప్పి.. నమ్మించి మోసం చేశాడు, అంతే కాకుండా ఆమెకు కడుపు చేసి.. అబార్షన్ చేయించుకోమన్నాడు.. అంతేకాకుండా ఈ విషయం ఎక్కడైనా బయట చెప్తే నిన్ను చంపేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడట.

ఆమె తల్లిదండ్రులు తన కూతురు జీవితం నాశనం అయిందని వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు చాలా గగ్గోలు పెట్టారంట. ఆ అమ్మాయి అతను ఒక పవర్ఫుల్ మనిషి అని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు ఏం చేయలేక..అదే బాధను తలుచుకుంటూ ఒక మానసిక రోగం తో ఇప్పుడు బాధపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు పోసాని. ఇక అమ్మాయి కూడా చాలా సన్నగా అయినట్లు సమాచారం. ఆ యువతికి న్యాయం చేయండి అంటూ పోసాని కృష్ణ మురళి ప్రశ్నిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: