తెలుగు సినిమా పరిశ్రమలో చాలా అరుదుగా ఇలాంటి వ్యక్తులు ఉంటారు. వీరి గురి అంతా సినిమాపైనే ఉంటుంది, సినిమానే ప్రాణంగా జీవిస్తారు. ఈ లక్షణాలు కేవలం అతి కొద్ది మందిలో మాత్రమే చూస్తుంటాము. అలాంటి వారిలో ఒకరే టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ మరియు నిర్మాత పూరీ జగన్నాథ్. అయితే చాలా మంది డైరెక్టర్ లు వారి సినిమాలను తీసే సమయంలో ఎవరినో స్ఫూర్తిగా తీసుకుని కథలను మలుస్తారు. కానీ పూరీ అలా కాదు. తనలోని లక్షణాలను బేస్ చేసుకుని ఒక్కో లక్షణాన్ని ఒక్కో కథగా తెరకెక్కిస్తూ ఉంటాడు. అందుకే తన సినిమాలు చాలా తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి అవుతూ ఉంటాయి. తన సినిమాలో ఏదో తెలియని ఒక స్టైల్ ఉంటుంది. తన సినిమాలోని హీరో అచ్చం పూరి లానే కనిపిస్తాడు.

ఇప్పుడు వస్తున్న చాలా మంది కొత్త డైరెక్టర్స్ పూరీని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. తమ సినిమా కెరీర్ లో ఎన్నో కష్టాలను అధిగమించాడు. ఒకానొక దశలో స్నేహితుల మోసం వల్ల తన యావదాస్తిని కోల్పోయి రోడ్డున పడ్డ సందర్భం చూశాము.  అయినా ఎప్పుడూ కష్టాలను చూసి కుంగి పోలేదు. తన స్వయం శక్తితో మళ్ళీ అంతే వేగంగా కెరీర్ లో సక్సెస్ సాధించి నిలబడ్డాడు. ఇప్పుడు మళ్లీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఈయన ఇప్పటి వరకు 33 సినిమాలను తెరకెక్కించాడు. 34 వ చిత్రం లైగర్ షూటింగ్ దశలో ఉంది. వీటిలో ప్రతి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తన సినిమా జీవితం 2006 లో బద్రి సినిమా నుండి ప్రారంభం అయింది. అప్పటి నుండి ఈ రోజు వరకు ఒక డైరెక్టర్ గా ఎంతో మార్పు చెందాడు. కాలానికి తగినట్లు తన టేకింగ్ లో మార్పులు చేసుకుంటూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ వస్తున్నాడు. కాగా ఇప్పుడు రౌడీ హీరో విజయ్ తో సినిమాను తెరకెక్కిస్తూ ఉన్నాడు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ మరియు ఛార్మి లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తోంది.  ఈ రోజు పూరీ జగన్నాథ్ తన 55 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: