దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ దర్శకులలో ఉన్న డైరెక్టర్లలో ఒకరు. ఇప్పటివరకు మనం హీరోలకు హీరోయిన్లకు మాత్రమే ఫ్యాన్స్ ఉండడం చూశాము. కానీ పూరి జగన్నాథ్ ఎప్పుడైతే సినిమాలను తెరకెక్కించడం మొదలు పెట్టాడో అప్పటినుంచి దర్శకులకు కూడా అభిమానులు పెరగడం జరిగింది. అలా టాలీవుడ్ లో మొదటగా స్టార్ స్టేటస్ పొందిన దర్శకుడిగా పూరి జగన్నాథ్ ను అభివర్ణించవచ్చు. పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు అందరూ హీరో లు. పెద్ద పెద్ద హీరోలు పూరితో సినిమా చేసి పూరి హీరో అనిపించుకోవాలని అనుకుంటారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఆయనతో సినిమా చేయని పెద్ద హీరో అంటే లేరనే చెప్పాలి.

పూరి జగన్నాథ్ తన కెరీర్ ను కూడా ఓ పెద్ద హీరో తోనే మొదలు పెట్టడం విశేషం.  పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో ఆయన తన కెరియర్ ను ప్రారంభించాడు. ఈ సినిమా ఛాన్స్ పూరి జగన్నాథ్ కు చాలా గమ్మత్తుగా వచ్చింది. అప్పటికే మంచి మంచి సినిమాలతో సూపర్ హిట్ అందుకొని పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఎదగడానికి రెడీగా ఉన్నాడు. చిరంజీవి తమ్ముడు అనే ఇమేజ్ నుంచి పవర్ స్టార్ ఇమేజ్ కి దగ్గర గా ఉన్న రోజులలో పూరి జగన్నాథ్ తనకు సన్నిహితుడైన చోటా కె నాయుడు పవన్ కళ్యాణ్ కోసం ఓ కథ ఉందని ఆయన సినిమాగా చేస్తే బాగుంటుందని చెప్పగా చోట కె నాయుడు సరే అని తను ముందు తనకు చెప్పమని చెప్పాడు.

అలా అయనకు కథ చెప్పి ఒప్పించి పవన్ కళ్యాణ్ టైం తీసుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కి కూడా స్టోరీ చెప్పి ఆయనతో సినిమా ఓకే చేసుకున్నాడు పూరిజగన్నాథ్. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. చోటా కి చెప్పింది ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ అయితే పవన్ కళ్యాణ్ వద్ద చెప్పింది మాత్రం బద్రి సినిమా కథ.  చోటా కె నాయుడు ను ఇంప్రేస్ చేయడం కోసం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పి పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కు సరిగ్గా సూటైన బద్రి సినిమా ను అయనంకి చెప్పి ఒప్పించి తొలి తెలుగు సినిమా ఛాన్స్ పట్టేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: