సినిమా ఇండస్ట్రీ లో ఎఫైర్ అనగానే అందరికీ హీరో హీరోయిన్లు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు. క్లోజ్ గా ఉండడం,  తరచు కలుస్తూ ఉండడం ముఖ్యంగా తెరపై రొమాన్స్ పండించడం వంటివి వారికి అఫైర్లు అంటగట్టడానికి ముఖ్య కారణాలు. హీరో హీరోయిన్ల మధ్య కొంచెం చనువు ఉందని తెలిసినా కూడా వెంటనే వారికి ఎఫైర్ లు అంటగడుతూ ఉంటారు. మరి వారి మధ్య ఉన్నది నిజమైన ప్రేమ అనేది కూడా తెలుసుకోకుండా వారికి అక్రమ సంబంధం అంటగడుతూ ఉంటారు.

ఇదే బయట చేస్తే మాత్రం ప్రేమ అని అంటారు. నిజంగా సినిమా వారంటే చాలా విషయాల్లో అందరికీ చులకనే. ఆ విధంగా హీరోయిన్ రెజీనా మరియు మెగా హీరో సాయిధరమ్ తేజ్ ల మధ్య ఉన్నది ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండానే వారిద్దరికీ కొంతమంది ప్రబుద్ధులు ఎఫైర్ అంటగట్టారు. పిల్ల నువ్వు లేని జీవితం అలాగే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో వీరు కలిసి నటించారు. నిజానికి ఓ రెండు మూడు రోజులు కలిసి ఉంటేనే ఈ రోజుల్లో ఆడ మగ చాలా క్లోజ్ అయిపోయి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోతున్నారు.

అలాంటిది రెండు సినిమాలు చేయడం అంటే దాదాపు రెండున్నర సంవత్సరాల కాలం పాటు కలిసి ఉండటమే. ఇన్ని రోజులు కలిసి ఉన్నప్పుడు తప్పకుండా వారి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి ఉంటుంది. ఆ విధంగానే వీరిద్దరి మధ్య కూడా మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. దానిని అపార్థం చేసుకుని మన ప్రబుద్ధులు వారి ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందని, ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని రాయడం మొదలు పెట్టారు. అది వారిని ఎంతగా బాధిస్తుందో వారికి మాత్రమే తెలుసు. ఈ వార్తలు రావడం ఏమోగానీ వారిద్దరూ తమ తమ సినిమాలతో ఆ తర్వాత బిజీగా మారిపోయారు. సాయి ధరమ్ తేజ్ స్టార్ హీరోగా రెజీనా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: