టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎప్పటినుంచో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా జనగణమన అనే సినిమా ను చేయాలనుకున్నాడు. మహేష్ బాబు తో ఆ సినిమా చేస్తే బాగుంటుందని మొదటినుంచి చూస్తూ ఉండగా ఎప్పటికప్పుడు మహేష్ బాబు దాన్ని పోస్ట్ ఫోన్ చేస్తూనే వచ్చాడు. ఒకసారి అసహనంతో మహేష్ బాబు పై కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు పూరీ జగన్నాథ్. పోకిరి బిజినెస్ బిజినెస్ మాన్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన కూడా ఆయనతో హ్యాట్రిక్ చిత్రాన్ని చేయడానికి ఆలోచిస్తూ ఉండటం ఎంతో బాధగా అనిపిస్తుంది అని పూరి జగన్నాథ్ చెప్పి సంచలనం సృష్టించాడు.

మహేష్ అభిమానులు కూడా పూరి తో సినిమా చేయాలని మహేష్ ను రిక్వెస్ట్ చేస్తున్నా మహేష్ ఎవరి మాట వినడం లేదు. ఇక వీరి కాంబో లో సినిమా ఇప్పట్లో రాదని తేలిపోవడంతో ఇద్దరు తదుపరి సినిమా లకు వెళ్ళిపోయారు. పూరి జగన్నాథ్ వరుస హిట్ లు చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాను కొంతమంది హీరోల తో చేయాలని భావించిన కూడా ఎవరూ సెట్ కాలేదు దాంతో విజయ్ దేవరకొండ తో చేయాలని ఆయన భావిస్తున్నాడు.  

ఇప్పటికే వీరి కాంబోలో లైగర్ సినిమాను మొదలు పెట్టి పూర్తి చేసే స్థాయికి వచ్చిన పూరి జగన్నాథ్ త్వరలో దీనికి సంబంధించిన ఈ విషయాన్ని కూడా వెల్లడించనున్నాడు. ఈ సినిమాలో మైక్ టైసన్ కూడా నటిస్తున్నట్లు దీనినే అధికారికంగా వెల్లడించింది చిత్రబృందం. ఏదేమైనా ఇస్మార్ట్ శంకర్ సినిమా తో బిగ్ కం బ్యాక్ చేసిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు లైగర్ సినిమాతో మరొకసారి సూపర్ హిట్ కొట్టే దిశగా ముందుకు వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండతో జనగణమన అనే సినిమాతో ఏ రేంజ్ లో హిట్ కొడతాడో చూడాలి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్న పూరి జగన్నాథ్ ఈ సినిమాను ఎప్పుడు ఎలా చెస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: