అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'లవ్ స్టోరీ'.క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల సెప్టెంబర్ 24 న విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతోంది.ఇక విడుదలకు ముందే పాటలు, టీజర్ లతో మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు విడుదల తర్వాత కూడాఅదే జోరును చూపిస్తోంది.ఇక మొదటి రోజే ఈ సినిమా సుమారు 10 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇక కరోనా సెకండ్ వేవ్ తర్వాత  ఈ రేంజ్ లో వసూళ్ళని అందుకున్న తొలి సినిమాగా లవ్ స్టోరీ ఓ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.

కేవలం ఇండియా లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక ఇప్పటికే అమెరికా లో మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.ఇక అటు మరోవైపు ఈ సినిమాపై సినీ సెలెబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటె ఈ సినిమా విజయాన్ని సెలెబ్రేట్ చేసుకునే పనిలో పడింది చిత్ర టీమ్.ఇందులో భాగంగానే సెప్టెంబర్ 28 మంగళవారం సాయంత్రం 6 గంటలకు మ్యాజికల్ సక్సెస్ మీట్ ను నిర్వహించనుంది చిత్ర బృందం.ఇక ఈ స్పెషల్ సక్సెస్ మీట్ కి కింగ్ నాగార్జున తో పాటుగా టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

దీంతో ఈ సక్సెస్ మీట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ తో పాటూ సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర లవ్ స్టోరీ సినిమాకలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.విడుదలకు ముందే ఈ సినిమాకి 30 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.ఈ నేపథ్యంలో మొదటి రెండు రోజుల్లోనే ఆ టార్గెట్ ని రీచ్ అయ్యింది ఈ సినిమా. ఇక విడుదల తర్వాత ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో రికార్డు దిశగా ఈ సినిమా వసూళ్లు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా 50 కోట్ల మార్క్ కి అతి చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.మొత్తం మీద చైతూ కెరీర్ భారీ వసూళ్లను అందుకున్న లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా 'లవ్ స్టోరీ సినిమా నిలిచిందనే చెప్పాలి.ఇక ఈ సినిమా తర్వాత విక్రమ్ కె. కుమార్ తో 'థ్యాంక్యూ' అనే సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య..!!

మరింత సమాచారం తెలుసుకోండి: