బాలీవుడ్ ప్రేమజంట ఆలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి పీటలేక్కబోతున్నారా?అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.ఇవాళ రణబీర్ కపూర్ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఈ ప్రేమ జంట జోధ్ పూర్ లో బర్త్ డే సెలెబ్రేషన్స్ ని జరుపుకొనున్నట్లు తెలుస్తోంది.ఇక గత కొన్నేళ్ళుగా ఆలియా భట్, రణబీర్ కపూర్ ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమతో ఉన్న విషయం తెలిసిందే.అంతేకాదు కొన్నాళ్లుగా ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.ఇక ఆ మధ్య రణబీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ మరణించినప్పుడు కూడా అతని వెంటే ఉంది ఆలియా.ఇక తాజాగా ఈ జంట జోధ్ పూర్ లో దర్శనమిచ్చారు.అక్కడ తమ వివాహ వేదికను వెతికే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తమ పెళ్లి కోసం సరైన వేదికను వెతకడం కోసమే ఈ జంట జోధ్ పూర్ కి వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలో ఇప్పటికే పలు ఫ్యాలెస్ లను ఫైనలైజ్ చేసి అందులో ఒకదాన్ని సెలక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక ఇదిలా ఉంటె గత ఏడాదే రణబీర్, ఆలియా లకు పెళ్లి కావాల్సింది. కానీ అదే సమయంలో రణబీర్ తండ్రి రిషీ కపూర్ మరణం, దానికి తోడు కరోనా వంటి కారణాల వల్ల వీరి పెళ్లి వాయిదా పడింది.ఇక వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'బ్రహ్మాస్త్ర'.ఈ సినిమాలో షెహేన్ షా అమితాబ్ తో పాటు అక్కినేని నాగార్జున సైతం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళంతో పాటూ పలు భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక రణబీర్ కపూర్ ఆలియా భట్ కన్నా ముందుకత్రినా కైఫ్, దీపికా పదుకునే లాంటి హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు హీరోయిన్స్ తో బ్రేకప్ చేసుకున్నాడు.ఇక గత కొంతకాలంగా ఆలియా భట్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు ఈ యంగ్ హీరో.ఇక ఆలియా భట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లలో రామ్ చరణ్ కి జోడిగా సీత పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే తన భాగం షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.ఇక ఈ సినిమాతో పాటూ తెలుగులో ఎన్టీఆర్ సరసన కూడా ఈ అమ్మడు జోడి కట్టనున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: