టాలీవుడ్
సినిమా పరిశ్రమలో మెగా ఫ్యామిలీని మెగా హీరోలను మెగా కుటుంబ సభ్యులను ఎవరైనా విమర్శిస్తే ఏమాత్రం ఊరుకోని విధంగా చేస్తూ నాగబాబు సదరు వ్యాఖ్యలు చేసిన వారిపై విమర్శలు చేస్తూ ఉంటాడు. సోషల్
మీడియా వేదికగా మరియు డైరెక్టుగా ప్రెస్మీట్లో ఎంతటివారినైనా విమర్శలు చేయగల సత్తా ఉన్న నాగబాబు ఇటీవలి కాలంలో
సినిమా పరిశ్రమలో జరుగుతున్న కొన్ని వ్యాఖ్యలపై స్పందించకపోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
గతంలో మెగా హీరోలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన
రామ్ గోపాల్ వర్మ మరియు యండమూరి వీరేంద్రనాథ్ వంటి ప్రముఖులను ఓ
సినిమా ఫంక్షన్ లో దారుణంగా విమర్శించాడు. అయితే ఇప్పుడు పవన్
కళ్యాణ్ ను అత్యంత దారుణంగా విమర్శించిన
krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి మరియు కొంతమందిని మాత్రం నోరు మెదపకుండా చూస్తూ ఉండడం పలువురికి అనుమానాలను కలిగిస్తుంది. పల్లెత్తు మాట కూడా అననీయకుండా తమ్ముడిని ఎంతో జాగ్రత్తగా చూసుకునే నాగబాబు ఎన్ని విమర్శలు చేసినా కూడా కామ్ గా ఉండడం ఏంటి అని వారు సోషల్
మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల కాలంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ లో పవన్
కళ్యాణ్ ఏపీ
ముఖ్యమంత్రి వైఎస్
జగన్ ను కొన్ని తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే దానికి
వైసీపీ నాయకులు పవన్
కళ్యాణ్ ను ఎంతగానో విమర్శిస్తున్నారు. ఇండస్ట్రీలోని కొంత మంది
వైసీపీ నాయకులు కూడా ఆయనను విమర్శిస్తున్నారు. ఆ విధంగా పోసాని
కృష్ణ మురళి పవన్
కళ్యాణ్ ని విమర్శించగా ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యామిలీ లోని ఎవరు స్పందించక పోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి భవిష్యత్తులో ఎవరైనా స్పందిస్తారో చూడాలి. అయితే ఇంకా నాగబాబు స్పందించక పోవడమే అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది అని అంటున్నారు.