బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కొన్నేళ్లుగా దసరా పండుగ అనంతరం హైదరాబాదులో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ జలవిహార్ లో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులను పలు రాష్ట్రాల గవర్నర్లను అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలోని మంచు విష్ణు మరియు పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ మరియు మంచు విష్ణు మధ్య ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి.

పవన్ కళ్యాణ్ కంటే ముందుగానే మంచు విష్ణు స్టేజ్ పై నిలుచుని ఉన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా స్టేజ్ పైకి వచ్చారు... అయితే మంచు విష్ణు ముందు నుండే పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పటికీ పవన్ విష్ణు ను పట్టించుకోలేదు. విష్ణు పలకరించే ప్రయత్నం కూడా చేసినట్టు వీడియోలో కనిపిస్తుంది. కానీ పవన్ ఆయనతో మాట్లాడకుండా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. అనంతరం ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నట్టు ఫోటోలో కనిపిస్తోంది.

అయితే ఇద్దరు ఒకరితో మరొకరు మాట్లాడకుండా ఎడమొహం పెడమొహంగా కూర్చోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు మాత్రం పవన్ కళ్యాణ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇక్కడ ఎవరు ఉన్నారో కనిపిస్తుందా..? అంటూ బలం సింబల్ షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే మా ఎన్నికల సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే... మెగా ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేయగా మంచు విష్ణు చిరంజీవి తనను ఎన్నికల నుండి తప్పుకోవాలని అన్నారని చెప్పారు. ఈ నేపథ్యం లో మోహన్ బాబు సైతం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ ఆసక్తికర కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: