ఒక పాపులర్ మోడల్ ను కాల్చి చంపిన ఘటన బీహార్, పాట్నా లో జరిగింది. మోడల్ అనిత దేవి అలియాస్ మోనా రాయ్ వయసు 36 ఏళ్లు. ఆమె రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామగిరి కాలనీలో గత కొంత కాలంగా నివసిస్తున్నారు. పాట్నా లో ఉన్న ప్రసిద్ధ మోడళ్లలో ఆమె కూడా ఒకరు. మోడలింగ్ రంగంలో ఆమెకు ఉన్న క్రేజ్ వేరు. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. ఆ భర్త పేరు సుమన్ కుమార్. ఆయన ఒక ఫోటో షాప్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 12న రాత్రి స్కూటీ పై ప్రయాణిస్తున్న ఆమెను గుర్తు తెలియని దుండగులు తుపాకితో కాల్చి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. కానీ సరిపడినంత డబ్బు లేకపోవడంతో ఆమె బంధువులు మోనాను ఐజిఐఎంఎస్ అనే ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతున్న మోనా కు ఆపరేషన్ జరిగిందని, కానీ పరిస్థితి ఇంకా అంత మెరుగ్గా లేదని ఆమె భర్త సుమన్ మీడియాకు వెల్లడించారు. ఇంకా అక్కడే చికిత్స పొందుతున్న మోనా ఆదివారం ఉదయం కన్ను మూసింది. మరోవైపు పోలీసులు ఈ కేసును విచారించి ప్రేమ వ్యవహారం కారణమనే నిర్ణయానికి వచ్చారు. అదే అనుమానంతో ప్రముఖ బిల్డర్ ఇంటిపై దాడి చేశారు. మోడల్ కు ఆ బిల్డర్ ఫ్లాట్ బహుమతి వచ్చినట్టు వెలుగులోకి వచ్చింది. అయితే చికిత్స మధ్యలో స్పృహలోకి వచ్చిన మోనా పోలీసులకు ఏం చెప్పలేదని తెలుస్తోంది. ఫుల్వరి షరీఫ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ బిల్లర్ రాజు ఇంటి పై దాడి చేసిన పోలీసులకు ఫ్రిజ్ లో మద్యం బాటిల్లు దొరికాయి. దీంతో ఆయనను మద్యం కేసులో జైలుకు పంపారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంతకు ముందే విచారణలో రాజు చెప్పాడు. కానీ పోలీసులు మరో కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: