నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికే 'అఖండ' షూటింగ్ ని పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొదటిసారి అఘోరా గా కనిపించనున్నాడు ఈ సీనియర్ హీరో.ఇప్పటికే ఆ పాత్రకి సంబంధించిన టీజర్ విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ప్రస్తుతం బాలయ్య అఖండ కోసం డబ్బింగ్ చెబుతున్నట్లు తెలుస్తోంది.ఇక త్వరలోనే ఈ సినిమా విడుదల కానుండగా.. ఈ సినిమా అనంతరం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నాడు.ఇక వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో బాలయ్య కోసం ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ని గోపిచంద్ మలినేని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

బాలయ్య ఈ సినిమాలో ఓ స్వామిజీ గెటప్ లో కనిపించనున్నాడట.పైగా ఈ పాత్రను రాసింది కూడా బాలయ్యనే.ముందు గోపిచంద్ బాలయ్యకు కథ వినిపించిన తర్వాత..ఈ కథలో ఒక కొత్త పాత్రను యాడ్ చేస్తే బాగుంటుందని..ఈ స్వామిజీ పాత్రను యాడ్ చేసారట.ఇక ఇప్పటికే అఖండ సినిమాలో అఘోరా పాత్రలో నటిస్తున్న బాలయ్య.. ఇప్పుడు మరోసారి గోపిచంద్ మలినేని సినిమాలో స్వామీజీగా నటించనున్నాడు.అయితే సినిమాలో ఇలాంటి పాత్రలు చేసినప్పటికీ అవి కొంతవరకే సినిమాలో కనిపిస్తాయి.ఇక మిగతా సినిమా మొత్తం ఫ్యాన్స్ కి నచ్చే విధంగానే బాలయ్య కనిపిస్తారు.ఇక ఈ సినిమాలో నందమూరి తారకరత్న కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అయితే తారకరత్న ది ఈ సినిమాలో నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది.తన పాత్రలో నెగెటివిటీ ఉన్నా.. అది ఎంతో ఎమోషనల్ ఉంటుందని అంటున్నారు.రాయలసీమ - కర్ణాటక బార్డర్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాలో తారకరత్న ఇగోతో రెచ్చిపోయే ఒక యువ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడట.పైగా ఈ సినిమాలో రాయలసీమకు సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని కూడా గోపిచంద్ మలినేని ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.మరికొన్ని రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. వారిలో ఒక హీరోయిన్ గా శృతిహాసన్ పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: