దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఇక అంతటా దీపాల వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి ఒక్కరు దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే దీపావళి లాంటి పెద్ద పండుగ వచ్చిందంటే ఇక అటు ఈటీవీ వాళ్ళు ఊరుకుంటారా. సాధారణంగానే ఏదో ఒక స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసే ఈటీవీ నిర్వాహకులు.. దీపావళి లాంటి పండగ కి మరింత గ్రాండ్గా ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న దసరా ఈవెంట్ ప్లాన్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు సూపర్ ఎంటర్టైన్మెంట్ పంచారు.



 ఇక ఇప్పుడు దీపావళి కోసం కూడా ఒక సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో ఇటీవలే విడుదల చేశారు ఈ టీవీ నిర్వాహకులు. ఇక ఈ ప్రోమో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా ప్రదీప్ ఇక ఈ ఈవెంట్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటారు. ఐదుగురు హీరోయిన్లు ఒకే స్టేజి మీద ఉంటే ఎలా ఉంటుంది... ఐదుగురు హీరోయిన్లు ఈ స్టేజి మీద నవ్వుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుంది.. ఐదుగురు హీరోయిన్లు ఈ స్టేజి మీద ఒకేసారి పర్ఫామెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ భారీ రేంజ్ లోనే ఇంట్రడక్షన్ ఇస్తాడు ప్రదీప్.



 ఇక ఆ తర్వాత రోజా,ప్రియమణి, ఇంద్రజ, పూర్ణ సహా మరో హీరోయిన్ కూడా ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోయారు. అంతేకాదు అదిరిపోయే పర్ఫామెన్స్ లతో కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఐదుగురు హీరోయిన్లు స్టేజి మీద డాన్స్ చేయడానికి సిద్ధమైపోయారు. అయితే ఈ దివాలి ఈవెంట్కు ఇటీవలే ఫేమస్ అయిన డైలాగ్ 'తగ్గేదేలే' అంటూ ఒక పేరు పెట్టారు. ఇక ఇదంతా చూస్తుంటే ఈ దివాళి కి కూడా మరోసారి బుల్లితెర ప్రేక్షకులందరికీ సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఈటీవీ నిర్వాహకులు సిద్ధమైపోయారు అన్నది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Etv