అఖిల్ చిన్నతనం నుండి సినిమా హీరో కావాలని ఎప్పుడు అనుకోలేదు. ముందుగా అతడు బోట్ రేసింగ్ పై దృష్టి పెట్టి టాప్ రెస్లర్ గా మారాలని కోరుకున్నాడు. ఆతరువాత అఖిల్ దృష్టి క్రికెట్ పై పడింది. కేవలం క్రికెట్ పై తన అభిరుచి పెంచుకోవడమే కాకుండా స్టార్ క్రికెట్ మ్యాచెస్ లో అఖిల్ క్రికెట్ ఆడుతూ ఉంటే అతడి ఆట ఆడే ప్రతిభ షాట్స్ చూసి ప్రోఫిషనల్ క్రికెటర్ అవుతాడు అంటూ చాలామంది జోశ్యం చెప్పారు.


అయితే జరిగింది వేరు అఖిల్ హీరోగా మారాడు. కానీ పూర్తిగా అదృష్టం కలిసి రాకపోవడంతో ఇంకా అతడికి ఒక సరైన బ్లాక్ బష్టర్ హిట్ తగలడం లేదు. దసరా రేస్ కు వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ హిట్ అయినప్పటికీ ఆపేరు పూజా హెగ్డే ఖాతాలోకి వెళ్ళిపోయింది. దీనితో సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూవీ పై అఖిల్ ఆశలు పెట్టుకున్నాడు.


ఈ పరిస్థితులు ఇలా ఉండగా అఖిల్ కు ఒక టాప్ క్రికెటర్ బయోపిక్ లో నటించే అవకాశం వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ విరాట్ కోహ్లీ జీవితం పై తీయబోతున్న బయోపిక్ కోసం అఖిల్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్. పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకొబోతున్న ఈమూవీకి ఒక ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.


క్రికెటర్ విరాట్ కోహ్లీ జీవితంలో అనేక వివాదాస్పద విషయాలు ఉన్నాయి. దీనికితోడు అనేకమంది బాలీవుడ్ హీరోయిన్స్ తో అతడు ప్రేమాయణం నడపడం ఆతరువాత బ్రేకప్ అవ్వడం మీడియాకు అప్పట్లో హాట్ టాపిక్. చివరకు అనుష్క శర్మను పెళ్ళి చేసుకున్న విరాట్ జీవితంలో సెటిల్ అయినప్పటికీ ఇప్పటికీ అతడు వివాదాలకు చిరునామాగా కొనసాగుతూనే ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి జీవితం పై తీసే బయోపిక్ అఖిల్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని అఖిల్ అభిమానులు ఆశ పడుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: