డార్లింగ్ ప్రభాస్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు, ఆ స్టార్ డమ్ ను కాపాడుకునే నేపథ్యంలో ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ జనాలను అలరిస్తున్నాడు, అయితే ఇప్పటికే ప్రభాస్ సాహో సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించి అదే స్థాయిలో విడుదల కూడా చేశాడు. ఇది ఇలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ పేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాదే శ్యామ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొన్ని సన్నివేశాలు తప్ప దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది.

 ఈ సినిమా టీజర్ ను ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా చేసింది. అలాగే సినిమాను కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే రాధే శ్యామ్ చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే రాదే శ్యామ్ సినిమా నుండి బయటకు వచ్చిన పోస్టర్ లకు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను కూడా భారీగా పెంచాయి అని చెప్పవచ్చు. ఇలా ఇప్పటికే జనాల్లో ఫుల్ హైప్ క్రియేట్ చేసిన రాదే శ్యామ్ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో 15 నిమిషాల నిడివి గల క్లైమాక్స్ సీన్ కోసం 50 కోట్ల వరకు చిత్ర బృందం ఖర్చు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం క్లైమాక్స్ కు మాత్రమే ఇంత ఖర్చు పెడితే సినిమా మొత్తం ఇంకెంత గ్రాండ్ గా ఉంటుందో అని జనాలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: