నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా తెలుగు క్లాస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ, ఈ సినిమా విడుదల తేదీని ఎన్నో సార్లు ప్రకటించిన చిత్ర బృందం కరోనా కారణాల వల్ల అనేక సార్లు సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా పై విడుదలకు ముందే జనాలలో మంచి హైప్ క్రియేట్ అయి ఉంది. దానికి ప్రధాన కారణం ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు జనాలకు నుండి మంచి రెస్పాన్స్ రావడమే. అలా మొదటి నుండే జనాలలో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లలో కూడా మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోయింది. నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతమైన నటన. శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభ.

 సినిమా సంగీతం ఇలా అనేక అంశాలతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సినిమాగా పేరు తెచ్చుకొని కలెక్షన్ లను కూడా బాగానే రాబట్టింది. ఆహా ఓటిటి లో ఈ నెల 22 నుండి లవ్ స్టోరీ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇలా తెలుగు ఇండస్ట్రీలో కరోనా సెకండ్  వేవ్ తర్వాత భారీ కలెక్షన్లను సాధించిన ఈ సినిమాను మలయాళంలో ప్రేమ తీరం అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. మలయాళం లో సాయి పల్లవి కి కూడా మంచి మార్కెట్ ఉంది. సాయిపల్లవి నటించిన ప్రేమమ్ సినిమా మలయాళం లో మంచి హిట్ సినిమాగా నిలిచింది. అలా గే సాయి పల్లవి నటించిన ఫిదా సినిమా కూడా మలయాళం లో విడుదలై మంచి కలెక్షన్ల ను రాబట్టింది. అక్టోబర్ 29 వ తేదీన ప్రేమ తీరం సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: