2, 3 ఏళ్ల నుంచి తెలుగులో పూజా హెగ్డే హవా కాస్త ఎక్కువగా పెరిగింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ కన్నడ భామ కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం కాస్త ముందు జాగ్రత్తలు తీసుకుం టుందని భవిష్యత్తు ఆలోచించి అడుగులు వేస్తుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. తనకు అవసరం ఉన్న వాళ్ల విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది అని  అవసరం లేని వాళ్ల విషయంలో పెద్దగా పట్టింపులు లేకుండానే ముందుకు వెళుతుందని కూడా అంటున్నారు. సినిమా పరిశ్రమలో తనకు ఎవరు అవసరం లేదు అనే దానిపై పూజా హెగ్డే ఒక అంచనాకు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల అఖిల్ సినిమా సక్సెస్ కార్యక్రమంలో ఆమె అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించడం ఆశ్చర్యపరిచింది. సినిమా హీరో  అఖిల్  కంటే కూడా అల్లు అర్జున్ పైన ఆమె ఎక్కువగా ప్రశంసలు కురిపించడం అల్లు అర్జున్ తో గతంలో పనిచేసిన అనుభవం నెమరువేసుకోవడం దువ్వాడ జగన్నాథం సమయంలో అదేవిధంగా గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురంలో సినిమా సమయంలో జరిగిన అనుభవాలను నెమరు వేసుకోవడం వంటివి పూజా హెగ్డే ఎక్కువగా చేసింది.

ఇది చాలామందిని ఆశ్చర్యపరిచింది కూడా. అసలు ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ని పిలిచింది పూజా హెగ్డే ద్వారా భజన చేయించడానికి అని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఆమె విషయంలో చాలా వరకు జాగ్రత్తగానే మాట్లాడాడు. ఏది ఎలా ఉన్నా సరే పూజా హెగ్డే టాలీవుడ్ లో  అవకాశాలు కోసం కాస్త ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోందని ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీని దగ్గర చేసుకోవడానికి అలాగే అల్లు ఫ్యామిలీ కూడా దగ్గర చేసుకునేందుకు ముందుకు వెళుతుందని ప్రశంసలు కురిపించింది అని టాలీవుడ్ జనాల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: