బుల్లితెర ప్రేక్షకులు బిగ్ బాస్ రియాల్టీ షోను ఎంతగానో ఆదరిస్తున్నారు. దానికి కారణం ఈ రియాలిటీ షో లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే ఈ షో పట్ల బుల్లితెర అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు.హౌస్ లో అప్పటి వరకు అందరూ కలిసిమెలిసి ఉండే కంటెస్టెంట్స్ ఒకేసారి కోపంతో ఊగి పోతుంటారు. గొడవకు దిగుతారు. కొట్టుకునే స్థాయి వరకు వెళ్లిపోతారు. మళ్ళీ వెంటనే కలుసుకుంటారు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఇక ఇప్పటికే ఈ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. వరుస సీజన్ లతో దూసుకుపోతోంది.ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో తాజాగా గురువారం కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ సర్ ప్రైజ్ ఇచ్చారు. అదేమిటంటే ఈ షోలో లోబో ఎలిమినేట్ అవ్వలేదని చూస్తున్న ప్రేక్షకులకు మాత్రమే తెలుసు.. కానీ హౌస్ మేట్స్ కి మాత్రం తెలియదు. దీంతో ఇన్ని రోజులు సీక్రెట్ రూమ్ లో ఉన్న లోబో ని గురువారం బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేశారు. ఇక లోబో మళ్ళీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం తో అందరూ ఒక్కసారిగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా రవి మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా వాటేసుకున్నాడు. ఇక మరోవైపు బిగ్ బాస్ పెట్టిన సీక్రెట్ టాస్క్ చిచ్చు.. షణ్ముఖ జేసీల మధ్య గొడవకు దారితీసినట్లు కనిపిస్తోంది. అందరూ తనను టాస్క్ సరిగా ఆడడని అంటున్నారని.. తనను అందరూ లైట్ తీసుకున్నారని..

 జెస్సి, సిరి ల ముందు షణ్ముక్ వాపోయాడు. ఇక జెస్సి కెప్టెన్ కావాలని అనుకున్నాడు అని.. దానికి సిరి సహాయం చేసిందని..తాను ఎదవ అయ్యానని షణ్ముఖ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అటు సిరి ఇటు జెసస్సి ఇద్దరు సంజాయిషీ ఇచ్చే ప్రయత్నం చేసినా.. షణ్ముక్ మాత్రం సిరిని అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని అరిచాడు. దీంతో sసిరి కూడా ఒక్కసారిగా ఏడ్చేసింది. అసలు ఈ ముగ్గురి మధ్య ఏం జరిగింది? దీంతో షణ్ముక్ సిరి, జెస్సి లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.అసలు ఈ ముగ్గురి మధ్య ఏం జరిగింది? ఇదంతా బిగ్ బాస్ పెట్టిన చిచ్చు ఫలితమేనా? ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం కెప్టెన్ అయ్యేది ఎవరు? ఇవన్నీ తెలియాలంటే  ఈ రోజు రాత్రి ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ ను చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: