బుల్లితెర టెలివిజన్ రంగంపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరుగాంచింది 'బిగ్ బాస్'. సీజన్లు మారుతున్నా కూడా ఈ షో కి అన్ని భాషల్లో ఎనలేని క్రేజ్ ఉంది. ఇక తెలుగులో కూడా కాస్త అటు ఇటుగా రేటింగ్స్ తగ్గినా కానీ ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది బిగ్ బాస్. ప్రస్తుతం ఐదో సీజన్ కూడా ఎంతో విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సీజన్ 5 లో ఆరు వారాలు పూర్తయ్యాయి. మొత్తం ఈ సీజన్ కి 19 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగుపెట్టగా.. ఆరుగురు ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా 13 మంది హౌస్ లో ఉన్నారు. అయితే ఈ షోకి తొలి రెండు వారాల్లో మినహా గత నాలుగు వారాల నుంచి వీక్షకులు తగ్గిపోతున్నారు. 

ఇక గత వారం చూసుకున్నట్లయితే ఈ షోకి రేటింగ్స్ భారీగా పడిపోయాయి. వీకెండ్స్ లో నాగార్జున వచ్చే ఎపిసోడ్ లో పరవాలేదనిపించినా.. మిగతా ఐదు రోజులు మాత్రం అంతగా రేటింగ్స్ రావడం లేదు. ఈ షో ప్రసారం అయ్యే సమయం కూడా రాత్రి 10 గంటలకు కావడం తో బిగ బాస్ ఇంకేదో చూపిస్తారని ప్రేక్షకులు అనుకున్నా.. ఈ షోలో మాత్రం పస లేకుండా పోయింది. ఆట సంగతి ఎలా ఉన్నా నా షో లో గ్లామర్ డోస్ తగ్గిపోయింది. ఈ సీజన్లో లహరి, శ్వేత, హమీదలు గ్లామర్ డాల్స్ గా అనే పేరు తెచ్చుకున్నారు. కానీ అనూహ్యంగా ఒక్కో వారానికి లహరి, హమీద, శ్వేత ఎలిమినేట్ అయిపోవడంతో.. ఈ షోపై ఇంట్రెస్ట్ అనేది ప్రేక్షకులు తగ్గిపోయింది.

 ఇక మిగిలిన వారితో గొడవలు, వాగ్వాదాలతో షో నడిపించాలని అనుకున్నా.. అది వీలు కావడం లేదు. కాబట్టి బిగ్ బాస్ లో ఇప్పుడు అత్యవసరంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండాలి అనేది అభిమానుల మాట. అది కూడా గ్లామర్ డాల్స్ ని ఇంట్లో దించితే ఆ కళనే వేరుగా ఉంటుంది అని అంటున్నారు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా త్వరలోనే ఉంటుందని రెండు వారాలుగా వార్తలు ప్రచారం అవుతున్నా.. అది నిజం కావడం లేదు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లో వైజాగ్ సోషల్ మీడియా స్టార్ ప్రీతి అన్షు మరియు ఇప్పటికే హౌస్ లో ఎలిమినేట్ అయిన లహరి లను ఇంట్లోకి పంపనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ ఇద్దరిని కనుక మళ్ళీ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపిస్తే కచ్చితంగా బిగ్ బాస్ కి రేటింగ్స్ వస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో...!!

మరింత సమాచారం తెలుసుకోండి: