ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరీర్ టాప్ లో ఉంది . ఒక్కక్క సినిమాతో క్రేజ్ పెంచుకుంటూ పోతున్న విజయ్ ఇప్పుడు టాలీవుడ్ నే కాకుండా పాన్ ఇండియా ని కూడా టార్గెట్ చేసి సినిమాలు చేస్తున్నాడు. ఆయన పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మీద ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా మీద ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

 దానికి కారణం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మైక్ టైసన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు . ఈ ఒక్క విషయం లైగర్ సినిమా మీద ఎక్కడలేని అంచనాకు పెంచేసింది. ఇక వచ్చే ఏడాది భారీ రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా మీద విజయ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమాని దృష్టిలో పెట్టుకొని ఆయన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ని కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ శివ నిర్వణ డైరెక్షన్ లో చేయబోయే సినిమా ప్రస్తుతం ఆపేశారు.అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం విజయ్ దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యారట.

 ఆ సినిమాకి దిల్ రాజు దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు. దిల్ రాజు తన సినీ ప్రస్థానంలో ఎన్నడు లేని విధంగా వందల కోట్లా బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. ఒక పక్క రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ సినిమా ఇంకోపక్క తమిళ సూపర్ స్టార్ విజయ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఇంకోక సినిమాని ప్లాన్ చేసి రెడి గా పెట్టాడు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఒక పాన్ ఇండియా సినిమా తియ్యలానే ఆలోచన లో ఉన్నాడట. ఇక ఈ సినిమా వచ్చే ఏడాదిలో పట్టాలు ఎక్కబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: