సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్, బ్యూటీవుల్ హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేష్ జంట గా వ‌చ్చిన సినిమా రిప‌బ్ల‌క్. ఈ సినిమా అక్టోబ‌ర్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొద‌ట్లో మంచి హిట్ టాక్ వ‌చ్చింది. అయితే ఈ సినిమా విడుద‌ల కు కొన్ని రోజుల ముందు హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు హైద్రాబాద్ లో ని కేబుల్ బ్రిడ్జ్ వ‌ద్ద బైక్ ప్ర‌మాదం జ‌రిగింది. దీని త‌ర్వాత ఈ సినిమా విడుద‌ల కావ‌డంతో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీనికి తోడు ఈ సినిమా ఫంక్ష‌న్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిని వ్యాఖ్య‌ల‌తో కూడా ఈ సినిమా కు మంచి ప‌బ్లిసిటీ జరిగింది. దీంతో సినిమా హిట్ అవ‌డం ఖాయ‌మ‌ని చిత్ర యూనిట్ భావించింది.



అయితే ఈ సినిమా తాజా షాక్ త‌గిలిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా కు ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన క‌లెక్ష‌న్ ల‌ను బట్టి చూస్తే బాగానే లాస్ వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తుంది. ఈ సినిమా ముందుగా రూ. 12.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్ర‌పంచ వ్యాప్తంగా థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయింది. దీని ప్ర‌కారం చూస్తే ఈ సినిమా కు లాస్ వ‌చ్చిన‌ట్టే అనిపిస్తుంది. ప్ర‌స్తుతానికి బాక్స్ ఆఫీస్ వ‌ద్ద రూ. 5.64 కోట్ల న‌ష్టంతో థీయేట‌ర్ ర‌న్నింగ్ ను పూర్తి చేసుకుంద‌ని స‌మాచారం. ఈ వార్త నిజం అయితే ఈ సినిమా డిసాస్ట‌ర్ గా నిలిచిన‌ట్టే అని చెప్పాలి. అయితే ఈ సినిమా ను దేవ క‌ట్టా తెర‌కెక్కించాడు. రిప‌బ్లిక్ సినిమా పొలిటిక‌ల్ డ్రామా తో సాగుతుంది. అయితే ప్రేక్ష‌కుల నుంచి మంచి టాక్ వ‌చ్చింది. కాని క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్ట లేక పోయింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద కేవ‌లం రూ. 6.86 క‌లెక్ష‌న్ మాత్ర‌మే రాబ‌ట్టింద‌ని సమాచారం.


 

మరింత సమాచారం తెలుసుకోండి: