అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ జాతకంపై కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి..ఇవన్నీ ని జమా? అబద్ధమా? అన్నవి అటుంచితే ఇప్పుడు ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కథనం ఇది. ఇటీ వల వి డిపోయిన సమంత - నాగ చైతన్య జంటలానే రకుల్ - జాకీ భగ్నానీ (హీరో కమ్ ప్రొడ్యూసర్) జంట కూడా ఇలాంటి పరిణా మాలనే ఎదుర్కొనబోతోందని అంటున్నారు. రకుల్ పెళ్లికి సంబంధించి తాను జాతకాలను పరిశీలించానని, కొన్ని దోషాలు ఉన్నా యని గు ర్తించానని చెబుతున్నారు. మిధున రాశికి చెందిన రకుల్ కు గురువు, కేతువు కలిసి ఉండడం వలన ఎట్టి పరిస్థితుల్లో నూ వివాహం కలిసి రాదని అంటున్నారు. వివాహం తరువాత ఆమె ఓ కేసు విషయమై జైలు పాలు కావడం కూడా తథ్యమని స్పష్టం చేస్తున్నా రు. అదేవిధంగా జాకీ భగ్నానికి కూడా జాతకం అనుకూలంగా లేదని మకర రాశికి చెందిన ఆయనకు కూడా ఈ వివాహం ఏమీ కలి సొచ్చే అవకాశాలే లేవని, శని దృష్టి కారణంగా ఆయనకు సమస్యలు తప్పవని తెలిపారు. చంద్రుడు, శుక్రుడి పై శని దృష్టి ఉండడం తో వైవాహిక బంధం నిలబడడం కష్టమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంకొన్ని ఆసక్తి దాయక విషయాలు కూడా వెల్లడించా రు.అసలు వీరిద్దరి పెళ్లి జరగడమే కుదరని పని అని అంటున్నారు. ఇక ఈ విషయమై నెటిజన్లు వేరే విధంగా స్పందిస్తున్నారు. జాతకాలను నమ్మాల్సిన పని లేదని ఒకరు, నమ్మినా, నమ్మకున్నా జరగాల్సింది జరగమ మానదు అని ఇంకొకరు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఏదేమైనప్పటికీ జాతకాలు అన్నవి అన్ని వేళలా అందరి నమ్మకాలనూ ప్రభావితం చేయవు. కొన్ని సార్లు కొందరికి అనుకూలం కావొచ్చు. ఇంకొందరి విషయంలో జ్యోతిష్యులు చెప్పిందే అబద్ధం కావొచ్చు. ఏవో కొన్ని జరిగినంత మాత్రాన అంతా నిజమే అనుకో
వడం ఓ భ్రమ. అయితే దోష నివారణకు సంబంధించి చెప్పే వాటిలో కొన్ని ప్రభావం చూపించనూ వచ్చు. కాదనం కానీ మన జీవితాల్లో ఇదే అంతిమం అని నిజ నిర్థారణ చేసేంత శక్తి జాతకాలకు లేనే లేదని వైజ్ఞానిక శాస్త్రమే నిరూపించింది. అయితే నమ్మకాలను కించపరచకుండా, వాటిని పాటించడంలో ఉన్న శాస్త్రీయతను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి వైదికులు చెబుతున్నారు. ఆ విధంగా ఈ జంట నమ్మకం నిజం అవుతుందని ఆశిద్దాం. ఈ విషయమై జ్యోతిష్యం అబద్ధం అయితే వేణు స్వామి మాటలు అబద్ధాలే అని తేలిపోవడం కూడా ఖాయం.