ఎన్నో సినిమాలలో నటించి తనకంటు ఒక గుర్తింపు పొందిన హీరోయిన్లలో చార్మి కూడా ఒకరు. ఇక ఈమె కూడా ఎన్నో వివాదాల్లో చిక్కుకొని చాలా ఇబ్బందులు పడిన కాలాలు కూడా ఉన్నాయట. తాజాగా డ్రగ్స్ కేసులో కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో వార్తలు కూడా వెలువడ్డాయి తెలిపింది. వాటన్నిటినీ ఎదుర్కొని మరింత బలంగా మారిపోయానని తెలిపింది హీరోయిన్ ఛార్మి.

ఎన్నో సంవత్సరాలుగా నటనకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత పూరి జగన్నాథ్ తో కలిసి ఎన్నో చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించింది. ఇక అప్పట్లో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న చార్మి, ఇప్పుడు నిర్మాతగా కూడా కొన్ని బాధ్యతల బరువును కూడా మోస్తోంది. తాజాగా రొమాంటిక్ సినిమాతో ఛార్మి గురించి ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోంది.

తాజాగా హీరోయిన్ ఛార్మి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యను ఇస్తూ.. అందులో కొన్ని సంచలన విషయాలను తెలియజేసింది. అప్పట్లో హీరోయిన్ గా నటించడమే చాలా కంఫర్ట్ గా ఉండేది.తన ఫోకస్ అంతా కేవలం ఫిట్ నెస్, బ్యూటీ మీదే ఉండేది. కానీ ఇప్పుడు నిర్మాతగా మారడం వల్ల గాడిద చాకిరీ చేయవలసి వస్తోంది అంటూ చెప్పుకొస్తోంది ఛార్మి. కానీ  నటన, నిర్మాణ రంగాలు అంటే నాకు చాలా ఇష్టం అని తెలియజేస్తోంది.

నిర్మాతగా ఉండడంవల్ల ప్రతి ఒక్కరికి కంఫర్ట్ చూడవలసిన బాధ్యత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి.. షూటింగ్ చివరి వరకు వెట్టిచాకిరి చేయాలని.. ప్రతిరోజు కష్టపడాల్సి ఉంటుందని తెలియజేసింది. కానీ తనకి ఇప్పటికీ ఎన్నో అవకాశాలు నటించడానికి వస్తున్నప్పటికీ తాను మాత్రం ఇప్పుడు నిర్మాణరంగంలో ఉన్నాను కాబట్టి నాకు నటనవైపు ఇంట్రెస్ట్ లేదని తెలియజేసేదట. ఇక హీరోయిన్ అయితే ఎప్పటికీ ఇక నటించలేనేమో అంటూ షాకింగ్ విషయం చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: