టాలీవుడ్ లో ఎలాంటి ఎక్స్‌పోజింగ్ ఇవ్వకుండా.. కేవలం తన నటనతో, డాన్స్ తోనే ప్రేక్షకులను బాగా అలరిస్తున్న హీరోయిన్ సాయి పల్లవి. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఒక తెలుగు ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు లు చేయడం వల్ల అవి వైరల్ గా మారుతున్నాయి. అవి ఏమిటో వాటి గురించి చూద్దాం.


సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో"తన అందం విషయంపై కొన్ని అభియోగాలు ఉండేవని తెలియజేసింది సాయి పల్లవి. తను చదువుకునే రోజుల్లోనే ఇండస్ట్రీ వైపు అడుగు వేశానని, అలాంటి సమయంలోనే అందరి అమ్మాయిలలాగే తన  అందం మీద తనకి కొన్ని భయాలు ఉండేవని చెప్పుకొస్తోంది. తను ఇండస్ట్రీకి రాకముందు చూసిన హీరోయిన్లంతా ముఖం మీద ఎలాంటి పింపుల్స్, మచ్చలు లేని వారిని అందరూ చాలా అందమైన మొహాలు కలిగిన వాళ్ళే అని చెప్పుకొచ్చింది.

కాబట్టి తను ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు తన ముఖం పై ఉండేటువంటి మొటిమలను చూసి సదురు ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో అని అనుకునే దాన్ని అంటు చెప్పుకొచ్చింది. కానీ"ప్రేమమ్"సినిమా విడుదలైన తర్వాత అలాంటి ఆలోచనలన్ని తప్పని తెలుసుకున్నాను చెప్పుకొచ్చింది. ప్రేక్షకులకు అందం కంటే, క్యారెక్టర్ ముఖ్యమని అప్పుడు తెలిసిందని చెప్పుకొచ్చింది.

ఇక ప్రతి ఒక్కరికి కేవలం నటనే అవసరం అని అప్పుడు తెలిసిందని చెప్పుకొచ్చింది సాయిపల్లవి. ఇక తాజాగా నాగ చైతన్య తో కలసి"లవ్ స్టోరీ"మూవీలో నటించిన ఈ ముద్దుగుమ్మ మరొక బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అలాగే హీరో రానా తో విరాట పర్వం  సినిమా లో కూడా నటించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా నాచురల్ స్టార్ నాని తో కలిసి"శ్యామ్ సింగర్"మూవీ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: